NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya: అయోధ్యలో భక్తుల రద్దీ.. 20 రోజుల పాటు దర్శనం వాయిదా వేసుకోండి.. ట్రస్ట్ అభ్యర్థన
    తదుపరి వార్తా కథనం
    Ayodhya: అయోధ్యలో భక్తుల రద్దీ.. 20 రోజుల పాటు దర్శనం వాయిదా వేసుకోండి.. ట్రస్ట్ అభ్యర్థన
    అయోధ్యలో భక్తుల రద్దీ.. 20 రోజుల పాటు దర్శనం వాయిదా వేసుకోండి.. ట్రస్ట్ అభ్యర్థన

    Ayodhya: అయోధ్యలో భక్తుల రద్దీ.. 20 రోజుల పాటు దర్శనం వాయిదా వేసుకోండి.. ట్రస్ట్ అభ్యర్థన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    12:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అయోధ్యలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేయడానికి, రామ్ లల్లా దర్శనార్థం భక్తులు అక్కడికి వస్తున్నారు.

    30 గంటల్లోనే 25 లక్షల మంది భక్తులు దర్శనమిచ్చారు.ఈ పరిస్థుతిలో, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక కీలక ప్రకటన చేసింది.

    భక్తులందరూ తమ అయోధ్య దర్శనాన్ని 20 రోజులు వాయిదా వేసుకోవాలని సూచన జారీ చేసింది.

    అయోధ్యలో భక్తుల రద్దీ అత్యంత పెరిగిందని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

    ఈ మేరకు ట్రస్ట్ ఒక ట్వీట్ చేసింది.

    వివరాలు 

    ఒక్కరోజులో 10 కోట్ల మంది కుంభమేళాకి..

    మౌని అమావాస్య రోజున, మహాకుంభమేళాకు విపరీతమైన భక్తులు వస్తారు. అధికారులు అంచనా వేసిన ప్రకారం, ఆ ఒక్కరోజులో 10 కోట్ల మంది కుంభమేళాకి రాగలుగుతారు.

    వీరిలో 10 కోట్లు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయగలుగుతారు. పవిత్ర స్నానాలు చేసిన తర్వాత, అయోధ్య దర్శనానికి కూడా వస్తారు.

    సమీప ప్రాంతాల నుండి వచ్చే భక్తులు తమ దర్శనాన్ని 15 నుంచి 20 రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు.

    సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సులభంగా దర్శనం అందించాలన్న బాధ్యత ట్రస్ట్ పై ఉందన్నారు.

    ఈ మేరకు భక్తులను వినమ్రంగా అభ్యర్థిస్తున్నట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    అయోధ్య

    Ayodhya mosque: అయోధ్యలో మసీదు నిర్మాణం అప్పటి నుంచే ప్రారంభం.. ఇస్లాం ఫౌండేషన్ క్లారిటీ  మసీదు
    Ayodhya Ram Mandir: జనవరి 22న సెలవు ప్రకటించి.. మద్యం బంద్ చేసిన రాష్ట్రాలు ఇవే..  శ్రీరాముడు
    Hanu-Man: అయోధ్య రామమందిరానికి 'హనుమాన్' టీమ్ ఎన్ని కోట్లు విరాళంగా ఇచ్చిందో తెలుసా? హను-మాన్
    Ram Mandir: అయోధ్య శాటిలైట్ ఫోటోలను విడుదల చేసిన ఇస్రో.. రామమందిరం ఎలా కనిపిస్తుందో తెలుసా?  ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025