NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను 
    తదుపరి వార్తా కథనం
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను 
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను

    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను 

    వ్రాసిన వారు Stalin
    May 03, 2023
    07:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మే 6వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

    అది బలపడి 7వ తేదీ నాటికి అల్పపీడనంగా మారొచ్చని చెప్పింది. తూర్పు తీర రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు.

    ఇప్పటికే అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతులకు ఇది పిడుగులాంటి వార్తనే చెప్పాలి.

    మే 9నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

    ఒకవేళ తుపాను ఏర్పడితే దానికి 'మోచా' పేరును పెట్టనున్నట్లు వెల్లడించింది. అయితే తుపాను ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుందనే ఐఎండీ స్పష్టంగా చెప్పలేదు.

    తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    తుపాను

    గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు 

    తుపాను సంభవిస్తే తీర ప్రాంత రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర చెప్పారు.

    ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను అభివృద్ధి చెందుతుందని తాము అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.

    తుపాను ప్రభావంతో మే 7 నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంపై గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల మత్స్యకారులు ఆగ్నేయ బంగాళాఖాతం వైపు వెళ్లవద్దని సూచించారు.

    అలాగే అక్కడ ఉన్నవారు మే 7లోపు ఖాళీ చేయాలని స్పష్టం చేశారు.

    ప్రస్తుతం తూర్పు తీరంలో ఎలాంటి హెచ్చరికలు లేవని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండటానికి ఇస్తున్న సమాచారం ఇది అని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాను
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ

    తుపాను

    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా

    తాజా వార్తలు

    May Day 2023: భారత్‌లో 'మే డే'ను మొదట ఎక్కడ నిర్వహించారు? తొలిసారి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? భారతదేశం
    గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర వాణిజ్య సిలిండర్
    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక జి.కిషన్ రెడ్డి
    సిరియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు హతం; టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటన  సిరియా

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి  మహారాష్ట్ర
    దేశంలో 10,753 కొత్త కరోనా కేసులు; 27మంది మృతి కరోనా కొత్త కేసులు
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా?  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025