LOADING...
Mohali: పంజాబ్‌లో ఈడీ దాడుల భయంతో.. నోట్ల కట్టల బ్యాగులు విసిరేసి పరార్
పంజాబ్‌లో ఈడీ దాడుల భయంతో.. నోట్ల కట్టల బ్యాగులు విసిరేసి పరార్

Mohali: పంజాబ్‌లో ఈడీ దాడుల భయంతో.. నోట్ల కట్టల బ్యాగులు విసిరేసి పరార్

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టిన సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. దాడుల భయంతో ఐదు వందల రూపాయల నోట్ల కట్టలతో నిండిన రెండు సంచులను భవనం పై నుంచి కిందకు విసిరివేశారు. అదే సమయంలో అక్కడికి వాహనంలో వచ్చిన ఓ డ్రైవర్ ఆ సంచులను తీసుకుని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశం అయింది. గ్రేటర్ మొహాలీ ప్రాంత అభివృద్ధి సంస్థలో భూవినియోగ అనుమతుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నితిన్ గోహల్‌కు, పంజాబ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారిగా పనిచేస్తున్న రజబీర్ ఘుమాన్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

రూ.500 నోట్ల కట్టలతో నిండిన రెండు బ్యాగులు 

ఈ నేపథ్యంలో పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లోని పలువురు నిర్మాణదారులు, స్థిరాస్తి సంస్థలకు చెందిన ఇళ్లు, కార్యాలయాలలో గురువారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మొహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లోకి అధికారులు ప్రవేశించగానే, అక్కడి నుంచి నగదు నిండిన రెండు సంచులను ఎవరో కిందకు విసిరేశారు. అదే సమయంలో ఒక వాహనంలో వచ్చిన డ్రైవర్ వాటిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను ఎవరో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఈ ఘటనను ఈడీ అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్‌ అవుతున్న వీడియో ఇదే..  

Advertisement