NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ లిక్కర్ స్కామ్: నిందితులకు బెయిల్ మంజూరు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ లిక్కర్ స్కామ్: నిందితులకు బెయిల్ మంజూరు
    దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఐదురురు నిందితులకు బెయిల్ మంజూరు

    దిల్లీ లిక్కర్ స్కామ్: నిందితులకు బెయిల్ మంజూరు

    వ్రాసిన వారు Stalin
    Jan 03, 2023
    01:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్‌లో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. నరేందర్ సింగ్, కుల్దీప్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిల్ళై, సమీర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే వీరు రెగ్యులర్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మొత్తం ఏడుగురిపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో ఐదుగురికి ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

    తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీకి చెందిన వారికి.. ఈ కేసుతో సంబంధం ఉండటంతో.. తెలుగు నాట వార్త సంచలనంగా మారింది.

    లిక్కర్ స్కామ్

    జనవరి 5న మరో ఛార్జ్ షీట్

    దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న..నిందితుల రిమాండ్ సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం పొడిగించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందుకు.. నిందితులుగా ఉన్న శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, విజయ్‌నాయర్‌, బోయిన్‌పల్లి అభిషేక్‌ రిమాండ్ పొడిగించాలని ప్రత్యేక కోర్టును ఈడీ కోరింది. దీంతో ఈ నెల 7వ తేదీ వరకు రిమాండ్‌ను కోర్టు పెంచింది. ఇదిలా ఉంటే. ఈ కేసులో జనవరి 5న మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఈడీ రెడీ అవుతోంది.

    దిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి ఛార్జ్ షీట్‌ను త్వరలో కోర్టుకు సమర్పిస్తామని ఈడీ చెప్పింది. నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరిస్తున్నట్లు కోర్టు వివరించారు అధికారులు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025