Page Loader
Bandi Sanjay: ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు
ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని చెప్పింది తానేనని ఆయన తెలిపారు. హైదరాబాద్‌, సిరిసిల్ల కేంద్రాలుగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని వెల్లడించారు. ప్రభాకర్‌రావు అనేక మంది జీవితాలను నాశనం చేశారని, బీఆర్ఎస్ నేతలు, వారి భార్యల ఫోన్లు కూడా ట్యాప్‌ చేసినట్టు ఆయన ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. 'పెద్దాయన చెప్పితే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని రాధాకిషన్‌ ఇప్పటికే చెప్పారు.

Details

నోటీసులు ఎందుకు ఇవ్వలేదు

కేసీఆర్‌, కేటీఆర్‌లకు ఇంకా నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. 'ఫోన్‌ ట్యాపింగ్‌కు వారే కారణం. సీఎంఓని అడ్డాగా చేసుకుని ప్రభాకర్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మర్యాదలు చేయడాన్ని ఆపాలని బండి సంజయ్‌ తెలిపారు. 'పేపర్‌ లీక్‌ కేసులో ప్రభాకర్‌రావే ఇచ్చిన ఆదేశాలపై నన్ను అరెస్టు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభాకర్‌రావు అండ్‌ కోని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. ప్రభాకర్‌రావు భారత్‌ వచ్చేముందే కేటీఆర్‌ అమెరికా ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. 'నాకు సిట్‌ అధికారుల నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. వారు వచ్చి విచారిస్తామని తెలిపారని బండి సంజయ్‌ చెప్పారు.