NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TG High Court: భూదాన్ భూముల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి
    తదుపరి వార్తా కథనం
    TG High Court: భూదాన్ భూముల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి
    భూదాన్ భూముల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి

    TG High Court: భూదాన్ భూముల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 29, 2025
    05:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భూదాన్ భూముల అంశంపై పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించింది.

    జస్టిస్ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కొందరు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.

    వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా ఉన్నారు. భూదాన్ భూముల్లో అక్రమాలు జరగుతున్న నేపథ్యంలో సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    Details

    నిషేధిత జాబితాలోకి చేర్చాలని ఆదేశం

    ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సి.వి. భాస్కర్‌రెడ్డి, రికార్డులను పరిశీలించి నాగారంలో ఉన్న 181, 182, 194, 195 సర్వే నంబర్ల భూములు భూదాన్ బోర్డు ఆధీనంలో ఉన్నాయని స్పష్టం చేశారు.

    పిటిషన్‌లో ఉన్నతాధికారులపై ఆరోపణలు ఉన్నందున వారి ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం జరగవచ్చని వ్యాఖ్యానించారు.

    హైకోర్టు, సామాజిక ఆస్తుల పరిరక్షణ కోసం ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించింది.

    తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ భూముల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగకూడదని, అన్యాక్రాంతం చేయడానికి వీలుకాదని ప్రతివాదులను ఆదేశించింది.

    ఈ నేపథ్యంలో పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైకోర్టు
    తెలంగాణ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    హైకోర్టు

    KCR:కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన హై కోర్టు..  ప్రభుత్వ వాదనలను సమర్థించిన న్యాయస్థానం  తెలంగాణ
    Devara: 'దేవర' టికెట్ల పెంపుపై హైకోర్టు కీలక నిర్ణయం  దేవర
    Telangana High Court: ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు  తెలంగాణ
    Telangana: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌ల పిటిషన్ కొట్టివేత తెలంగాణ

    తెలంగాణ

    Telangana Govt: గిగ్ వర్కర్ల కోసం తెలంగాణ సర్కార్ కొత్త పాలసీ.. 7 లక్షల మందికి రక్షణ! రేవంత్ రెడ్డి
    Telangana SC Act : తెలంగాణలో ఎస్సీ కులాల వర్గీకరణ.. ప్రభుత్వ జీవో విడుదల! ఇండియా
    Telangana Rains: తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వాతావరణ శాఖ
    Kaushik Reddy: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి: కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025