Loading...
Bihar: బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు

Bihar: బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. లఖిసరాయ్‌ జిల్లాలోని ప్రముఖ అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. మృతుల సంఖ్యపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. శ్రావణమాసం సోమవారం కావడంతో అశోక్‌ధామ్ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఒక విద్యుత్‌ వైర్‌ తెగి కింద పడటంతో అక్కడున్న వారిలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.

వివరాలు 

విద్యుత్‌ షాక్‌ తగులుతుందేమోనన్న భయంతో..

విద్యుత్‌ షాక్‌ తగులుతుందేమోనన్న భయంతో భక్తులు అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ఒక్కసారిగా పరుగులు తీశారు.

దీంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులు కిందపడిపోయి గాయపడ్డారు.

తీవ్రంగా గాయపడిన వారితో పాటు ఇతర క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు భక్తులు మృతి చెందినట్లు సమాచారం.

అయితే మృతుల సంఖ్యపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT