LOADING...
Tamil Nadu: అన్నామలై మినహా.. తమిళనాడు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. 27 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు
27 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు

Tamil Nadu: అన్నామలై మినహా.. తమిళనాడు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. 27 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 27 మంది అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు K.అన్నామలై పేరు ఇందులో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ జాబితాలో ప్రముఖ నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. మైలపోర్ నుంచి, కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్.. అవనాషి స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఎన్‌డీయే కూటమి భాగంగా పోటీ చేస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో కూటమి భాగస్వామ్యంగా సీట్ల పంపకం జరిగింది.

వివరాలు 

ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ 

ఇందులో AIADMK 169 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 27 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెడుతోంది. PMK పార్టీ 18 స్థానాల్లో, AMMK పార్టీ 11 స్థానాల్లో పోటీ చేయనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం మే 10తో ముగియనుంది. మరోవైపు అధికార పార్టీ DMK సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) కూటమిగా ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది. ఈ కూటమిలో వామపక్షాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తో పాటు ఇతర చిన్నపార్టీలు కూడా భాగస్వామ్యంగా ఉన్నాయి.

వివరాలు 

ఈ ఎన్నికల్లోTVK పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోంది

ఇక రాజకీయ రంగంలో కొత్తగా ప్రవేశించిన నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా నిలవనుంది. ఈ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. మరోవైపు నటుడు కమల్ హాసన్ స్థాపించిన MNM పార్టీ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంది. దీంతో ఆ పార్టీ తరఫున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారు చెల్లించిన రూ.50 వేల ఫీజును తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది.

Advertisement