NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Political Party Donations: బీజేపీ సంచలనం.. ఒక్క ఏడాదిలోనే ₹2,243 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కి ఎంత వచ్చిందంటే..?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Political Party Donations: బీజేపీ సంచలనం.. ఒక్క ఏడాదిలోనే ₹2,243 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కి ఎంత వచ్చిందంటే..?
    బీజేపీ సంచలనం.. ఒక్క ఏడాదిలోనే ₹2,243 కోట్ల విరాళాలు

    Political Party Donations: బీజేపీ సంచలనం.. ఒక్క ఏడాదిలోనే ₹2,243 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కి ఎంత వచ్చిందంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 08, 2025
    09:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదికను విడుదల చేసింది.

    విరాళాల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), మిగతా పార్టీల కంటే ఎంతో ఎక్కువ మొత్తం విరాళాలు అందుకుంది.

    గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి బీజేపీకి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు అధికంగా వచ్చాయని నివేదిక పేర్కొంది.

    విరాళాల పరంగా రెండో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించగా, ఈ గణాంకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

    ఈ నేపధ్యంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలపై ఓసారి వివరంగా పరిశీలిద్దాం.

    వివరాలు 

    బీజేపీకి రూ.2,243 కోట్లు - అగ్రస్థానం దక్కించుకున్న కాషాయ పార్టీ 

    2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.2,243 కోట్లకు పైగా విరాళాలు అందాయి.జాతీయ రాజకీయ పార్టీలలో ఇది అత్యధిక మొత్తమే.

    ఈ వివరాలు ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొనబడ్డాయి.ఈ సమాచారం ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన డేటా ఆధారంగా తయారు చేయబడినది.

    ముఖ్యంగా రూ.20,000 పైగా విరాళాల గురించిన సమాచారం ఈ గణాంకాల్లో ఉంది.ఇందులో భాగంగా, మొత్తం 12,547 మంది దాతల నుంచి రూ.2,544.28 కోట్లు విరాళంగా వచ్చాయి.

    గత ఏడాది రూ.12.547 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. ఈసారి గతంతో పోల్చుకుంటే దాదాపు 199 శాతం పెరుగుదల చోటుచేసుకుంది.

    ఈ మొత్తంలో బీజేపీకి వచ్చిన విరాళాల వాటా 88 శాతం. మొత్తం 1,994మంది దాతలు బీజేపీకి రూ.2,243 కోట్ల రూపాయలను అందించారు.

    వివరాలు 

    రెండో స్థానంలో కాంగ్రెస్ 

    ఇది గత సంవత్సరం కంటే 211 శాతం అధికం.

    బీజేపీ తర్వాత స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి రూ.281 కోట్ల విరాళాలు లభించాయి.

    కాషాయ పార్టితో పోల్చుకుంటే ఇది తక్కువే అయినా, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెరుగుదల దృష్ట్యా ఇది గమనించదగ్గ విషయమే.

    2022-23 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్‌కు రూ.79.924 కోట్లు మాత్రమే రావగా, 2023-24లో అది రూ.281.48 కోట్లకు చేరుకుంది. ఇది 252.18 శాతం వృద్ధిని సూచిస్తుంది.

    ఇతర పార్టీలు

    ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలు తక్కువ మొత్తంలోనే విరాళాలను పొందినట్లు నివేదిక తెలిపింది.

    మరోవైపు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాత్రం గతంలాగే ఈసారి కూడా తమకు ఎలాంటి విరాళాలు అందలేదని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    బీజేపీ

    Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. మరో మ్యానిఫెస్టో ప్రకటించిన బీజేపీ  భారతదేశం
    BJP: మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తాం : అమిత్ షా అమిత్ షా
    AP Nominated Posts: నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి.. కొత్త జాబితా సిద్ధం! తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    BJP: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి రూ. 1,737 కోట్లకు పైగా ఖర్చు  ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025