BJP: బీజేపీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,654 కోట్లు విరాళాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తం విరాళాలు అందినట్లు సమాచారం. రిపోర్టుల ప్రకారం, ఈసారి బీజేపీకి మొత్తం రూ. 6,654 కోట్లు విరాళంగా లభించాయి. సభ్యత్వ రికార్డులను ఆధారంగా చూస్తే, ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా, లోక్సభ ఎన్నికలు జరిగే ఆ సంవత్సరంలో, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 68 శాతం విరాళాలు పెరిగాయి, అని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నివేదికను డిసెంబర్ 8, 2025న సమర్పించారు. ప్రస్తుతానికి ఈ నివేదిక ఎసీ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే, 20,000 రూపాయలకంటే ఎక్కువ విరాళాలు అందుకున్న పార్టీ వివరాలే వెబ్సైట్లో ప్రస్తావించారు.
వివరాలు
68 శాతం పెరుగుదల
నివేదిక ప్రకారం, ఈ విరాళాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 30, 2025 వరకు లభించాయి. ఈ కాలంలో, దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూ-కశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ. 3,967 కోట్లు విరాళాలుగా లభించగా, ఈసారి 68 శాతం పెరుగుదల కనిపించింది. బీజేపీకి వచ్చిన విరాళాల్లో సుమారు 40 శాతం ఎలక్టోరల్ ట్రస్ట్ల నుంచి వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.
వివరాలు
విరాళ వివరాలు
ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ - 2,180 కోట్లు ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ - 757 కోట్లు న్యూ డెమోక్రాటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్ - 150 కోట్లు ఇతర ట్రస్ట్లు సుమారు 3,112.5 కోట్లు విరాళాలుగా అందజేశాయి. ప్రముఖ కంపెనీలు కూడా విరాళాలు అందించాయి. ముఖ్యంగా: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా - 100 కోట్లు రుంగ్తా సన్స్ ప్రైవేటు సంస్థ - 95 కోట్లు వేదాంత్ - 67 కోట్లు మాక్రోటెక్ డెవలపర్స్ - 65 కోట్లు బజాజ్ గ్రూప్ కంపెనీలు - 65 కోట్లు డిరైవ్ ఇన్వెస్ట్మెంట్స్ - 50 కోట్లు మలాబార్ గోల్డ్ - 10 కోట్లు కళ్యాణ్ జువెలర్స్ - 15 కోట్లు
వివరాలు
బీజేపీ నాయకుల నుండి కూడా విరాళాలు
హీరో గ్రూప్ - 23 కోట్లు దిలీప్ బిల్డైకాన్ గ్రూప్ - 29 కోట్లు ఐటీసీ లిమిటెడ్ - 35 కోట్లు వేవ్ ఇండస్ట్రీస్ - 6 కోట్లు జిరోదా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ - 1.5 కోట్లు బీజేపీ నాయకుల నుండి కూడా విరాళాలు పెద్ద మొత్తంలో వచ్చాయి: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ - 3 లక్షలు మంత్రి పీయూష్ హజారికి - 2.75 లక్షలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన - 1 లక్ష ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీ - 5 లక్షలు ఇండోర్ మేయర్ భార్గవ్ - 1 లక్ష ఆకాశ్ విజయవర్గియా - 1 లక్ష
వివరాలు
కాంగ్రెస్ పార్టీకి 522.13 కోట్ల విరాళాలు
వీటికి భిన్నంగా, కాంగ్రెస్ పార్టీకి విరాళాలు గణనీయంగా తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 522.13 కోట్లు మాత్రమే విరాళాలుగా అందాయి. గత ఆర్థిక సంవత్సరంలో 1,129 కోట్లు అందుకున్న కాంగ్రెస్, ఈసారి 43 శాతం తగ్గిన విరాళాలు పొందినట్లు రిపోర్ట్ తెలిపింది.