Maharashtra civic polls: ముంబైలో బీజేపీ దూకుడు.. థానేలో శివసేన ఆధిక్యం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో (Maharashtra civic polls) బీజేపీ దూకుడు కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేతో కలిసి పోటీ చేసిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లోనూ బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ముంబైలోని 227 వార్డుల్లో ప్రస్తుతం బీజేపీ 62 స్థానాల్లో లీడింగ్లో ఉండగా, మరో 46 స్థానాల్లో ఆధిక్యం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక షిండే వర్గానికి చెందిన శివసేన 16 వార్డుల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది గురువారం పోలింగ్ సందర్భంగా ఏకమైన థాకరే సోదరుల ప్రభావం పెద్దగా కనిపించలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Details
ఎంఎన్ఎస్ 6 స్థానాల్లో ముందంజ
ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ 10 స్థానాల్లో, రాజ్ థాకరే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ 6 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. షిండేకు బలమైన పట్టున్న థానేలో శివసేన ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడి 131 వార్డుల్లో 9 వార్డుల్లో శివసేన లీడింగ్లో ఉంది. ఇక పుణెలో బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అక్కడ 32 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తంగా మహారాష్ట్రలో 29 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగగా, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహాయుతి కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు వెలువడ్డాయి.
Details
52శాతం పోలింగ్ నమోదు
ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో 52 శాతం పోలింగ్ నమోదైంది. శాంబాజీనగర్, నవి ముంబై, వాసాయి-విరార్, కల్యాణ్-డోంబివిలీ, కోల్హాపూర్, నాగపూర్, సోలాపూర్, అమరావతి, అకోలా, నాషిక్, పింప్రి చించవాడ్, పుణె, ఉల్లాస్నగర్, థానే, చంద్రాపూర్, పర్భనీ, మీరా భయాందర్ నాందేడ్, వాగాలా, పాన్వేల్, భీవండి-నిజాంపూర్, లాతూర్, మాలేగావ్, సంగ్లీ-మిరాజ్-కుప్వాడ్, జల్గావ్, అహిల్యనగర్, దూలే, జాల్నా, ఇచల్కరణ్జి మున్సిపాల్టీల్లో ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయి.