NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sanatan Dharma row:ఉదయనిధి స్టాలిన్‌పై 'జెనోసైడ్' అంటూ ట్వీట్.. అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్
    తదుపరి వార్తా కథనం
    Sanatan Dharma row:ఉదయనిధి స్టాలిన్‌పై 'జెనోసైడ్' అంటూ ట్వీట్.. అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్
    అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్

    Sanatan Dharma row:ఉదయనిధి స్టాలిన్‌పై 'జెనోసైడ్' అంటూ ట్వీట్.. అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 07, 2023
    09:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    డీఎంకే అధినేత,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చేసిన ట్వీట్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది.

    'సనాతన ధర్మం'పై ఇటీవల ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు, దానిని అనుసరించే 80 శాతం మంది జనాభా "జాతి నిర్మూలన"కు పిలుపునిచ్చిందని మాల్వియా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

    డీఎంకే కార్యకర్త కేఏవీ దినకరన్ ఫిర్యాదు మేరకు తమిళనాడులోని తిరుచ్చిలో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.

    భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 153, 153 (A), 504, 505 (1) (b) సెక్షన్ల కింద మాల్వియాపై కేసు నమోదు చేశారు.

    Details 

    ఉదయనిధిని విమర్శించిన హిందుత్వ గ్రూపులు,బీజేపీ,ఇతర రాజకీయ పార్టీలు

    సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినప్పటికీ,రాజకీయ ఉద్దేశ్యంతో,రెండు వర్గాల మధ్య హింస,ద్వేషాన్ని రెచ్చగొట్టడం,మత సామరస్యాన్ని దెబ్బతీసేలా మంత్రి చేసిన ప్రసంగాన్ని అమిత్ మాలవ్య ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    'సనాతన ధర్మం'పై ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించింది.

    దీని తర్వాత అనేక హిందుత్వ గ్రూపులు, బిజెపితో సహా రాజకీయ పార్టీలు డీఎంకే నాయకుడిని విమర్శించాయి.

    సెప్టెంబరు 3న జరిగిన సదస్సులో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని అన్నారు.

    Details 

    అట్టడుగు వర్గాల తరపున నేను మాట్లాడాను: ఉదయనిధి 

    మాల్వియా ట్వీట్ తర్వాత, సనాతన ధర్మాన్ని అనుసరించే వారిపై హింసకు తాను పిలుపు ఇవ్వలేదని ఉదయనిధి స్పష్టం చేశారు.

    అయితే, తన వ్యాఖ్యలకు తాను కట్టుబడిఉన్నానని ,అంతేకాకుండా ఎలాంటి న్యాయపరమైన సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటానని ఉదయనిధి చెప్పారు.

    'సనాతన ధర్మం' వల్ల నష్టపోతున్న అట్టడుగు వర్గాల తరపున తాను మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సనాతన ధర్మం
    ఉదయనిధి స్టాలిన్
    బీజేపీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    సనాతన ధర్మం

    Sanatana Dharma Day: సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించిన అమెరికా నగరం  అమెరికా

    ఉదయనిధి స్టాలిన్

    ఉదయనిధి తలకు రూ. 10 కోట్ల బహుమానం ప్రకటించిన అయోధ్య స్వామిజీ  భారతదేశం
    Mamata Banerjee: అన్ని మతాలను గౌరవించాలి: ఉదయనిధి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్  మమతా బెనర్జీ
    Ram Charan: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్ రామ్ చరణ్
    ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని సీజేఐకి ప్రముఖ పౌరులు లేఖ  డివై చంద్రచూడ్

    బీజేపీ

    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్
    బీజేపీ,ఆర్ఎస్ఎస్‭లకు అధికారం మాత్రమే కావాలి.. దాని కోసం మణిపూర్‭ను తగలబెడతారు : రాహుల్  రాహుల్ గాంధీ
    మహిళలను గౌరవించకపోతే దేశం పురోగమించదు.. బీజేపీ అధికార దాహంతో ఆటలాడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025