LOADING...
Delhi Bomb Blast: దిల్లీలో బాంబు పేలుడు.. ఐ20 కారు సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి! 
దిల్లీలో బాంబు పేలుడు.. ఐ20 కారు సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి!

Delhi Bomb Blast: దిల్లీలో బాంబు పేలుడు.. ఐ20 కారు సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు (Delhi Bomb Blast) ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ పేలుడుకు కారణమైన హ్యుందాయ్ ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడుకు కొన్ని క్షణాల ముందు, ఒక వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలు అధికారులు గుర్తించారు. అతడి పేరు ఉమర్ మహ్మద్ అని అనుమానిస్తున్నట్లు సమాచారం. అధికారులు అతడికి ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. అయితే, ఈ కారును చివరిసారిగా పుల్వామాకు చెందిన తారిఖ్ కొనుగోలు చేసినట్టు అనుమానాలు ఉన్నాయి.

Details

హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు

ఘటనకు ముందు కారు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు పరిశీలించగా హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కారు 'HR 26 CE 7674' నంబర్ ప్లేటుతో ఎర్రకోట సమీపంలోని పార్కింగ్‌లో దాదాపు మూడు గంటల పాటు ఉంచబడినట్లు గుర్తించారు. పార్కింగ్ సమయంలో, సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు అక్కడికి వచ్చిన కారు సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉందని అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో కారులో ఉన్న అనుమానితులు ఒక్కసారి కూడా కిందకు దిగలేదని అధికార వర్గాలు చెప్పారు. వీరు పార్కింగ్‌లో ఎదురుచూస్తూ ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక, ఈ కారుపై పలు ట్రాఫిక్ చలానాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఎక్కువగా దిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఉన్నాయి.

Advertisement