NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajasthan borewell accident: బోరుబావి ప్రమాదం.. 8 రోజులగా మృత్యువుతో పోరాడుతున్న 3 ఏళ్ల చిన్నారి
    తదుపరి వార్తా కథనం
    Rajasthan borewell accident: బోరుబావి ప్రమాదం.. 8 రోజులగా మృత్యువుతో పోరాడుతున్న 3 ఏళ్ల చిన్నారి
    బోరుబావి ప్రమాదం.. 8 రోజులగా మృత్యువుతో పోరాడుతున్న 3 ఏళ్ల చిన్నారి

    Rajasthan borewell accident: బోరుబావి ప్రమాదం.. 8 రోజులగా మృత్యువుతో పోరాడుతున్న 3 ఏళ్ల చిన్నారి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 30, 2024
    09:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లా కిరాట్‌పుర గ్రామంలో మూడేళ్ల చేతన ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయిన ఘటన దేశ ప్రజలను విషాదంలో ముంచింది.

    డిసెంబరు 23న తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన చిన్నారి, ఆడుకుంటున్న సమయంలో బోరుబావిలో 170 అడుగుల లోతులో చిక్కుకుపోయింది.

    ఈ సంఘటన గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అధికారులను సంప్రదించగా, ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు.

    తొలుత హుకప్‌ టెక్నిక్‌ ద్వారా బాలికను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించగా, అది ఫలించలేదు. దాంతో బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వడం ప్రారంభించారు.

    ఈ ప్రయత్నంలో ర్యాట్‌హోల్‌ మైనర్లు, పాలింగ్ మిషన్ సహాయంతో 170 అడుగుల సొరంగం తవ్వారు.

    చేతనకు చేరుకునే మార్గంలో పెద్ద బండరాయి అడ్డుగా రావడంతో రక్షణ చర్యలు నెమ్మదించాయి.

    Details

    పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతున్న సిబ్బంది

    సిబ్బంది రాయిని ముక్కలు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి రాయిని తొలగించి బాలిక వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    ఎనిమిది రోజులుగా చేతన బోరుబావిలోనే మృత్యువుతో పోరాడుతోంది. పైపుల ద్వారా ఆక్సిజన్‌ పంపిస్తుండగా, కెమెరాల ద్వారా ఆమె కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నారు.

    అయితే ప్రస్తుతం ఆమె స్పృహ కోల్పోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి.

    బోరుబావి ప్రమాదాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లో గుణ జిల్లాలో 140 అడుగుల లోతున్న బోరుబావిలో పదేళ్ల బాలుడు పడిపోయాడు.

    16 గంటలపాటు శ్రమించి రెస్క్యూ టీం అతడిని బయటకు తీసుకురాగలిగింది. అయితే ఆసుపత్రికి తరలించినప్పటికీ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    ఇండియా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రాజస్థాన్

    Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ  కాంగ్రెస్
    Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌.. సచిన్‌కు కీలక బాధ్యతలు  కాంగ్రెస్
    Student Suicide in Kota: కోటాలో ఆగని సూసైడ్స్‌.. మరో నీట్‌ విద్యార్ధి ఆత్మహత్య!  భారతదేశం
    Kota:: 'అమ్మా నాన్న, జేఈఈ నా వల్ల కాదు.. జేఈఈ, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మహత్య  భారతదేశం

    ఇండియా

    Fetus brain 3d images: పిండంలో మెదడు.. 3డీ హై రిజల్యూషన్ చిత్రాలతో విప్లవాత్మక పరిశోధన మెదడు
    Year Ender 2024: ఇండియా నుంచి గ్రీక్ వరకూ.. అత్యుత్తమ వంటకాలు అందించిన టాప్ దేశాలివే! సంవత్సరం ముగింపు 2024
    Tiger Corridor :కాగజ్‌నగర్ డివిజన్‌లో టైగర్ కారిడార్ ప్రాజెక్ట్.. అటవీశాఖ ప్రయత్నాలు ప్రపంచం
    LK Advani: బీజేపీ అగ్రనేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025