
BRS: నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన బీఆర్ఎస్.. లోక్సభ పోరులో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాలుగు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించారు.
తొలి జాబితాలో బోయినపల్లి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావుకు చోటు దక్కింది.
కొంతమంది సిట్టింగ్ ఎంపీలను పార్టీ మార్చే అవకాశం ఉందని, వారి స్థానంలో కొత్తవారిని నిలబెట్టే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ నాలుగు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు.
కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెదపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ కవిత మాలోత్లను బరిలోకి దింపుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తొలి జాబితా ఇదే..
2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
— BRS Party (@BRSparty) March 4, 2024
అందులో భాగంగా 4 లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశారు. pic.twitter.com/rqXjTVBOc6