Loading...
Bullet Train: తెలంగాణకు బుల్లెట్ వేగం.. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణకు బుల్లెట్ వేగం.. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు గ్రీన్ సిగ్నల్!

Bullet Train: తెలంగాణకు బుల్లెట్ వేగం.. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు గ్రీన్ సిగ్నల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణను దేశంలోని హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-పుణె-ముంబయి, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించిన సవరించిన ఎలైన్‌మెంట్లు, స్టేషన్లు, డిపోల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు కేంద్ర హబ్‌గా శంషాబాద్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ప్రధాన రైల్వే స్టేషన్‌తో పాటు రోలింగ్ స్టాక్ డిపో, వర్క్‌షాప్ నిర్మాణం కోసం 400 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. హైస్పీడ్ రైలు కారిడార్ల తుది ఎలైన్‌మెంట్లను హెచ్‌ఎండీఏ, ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్లో చేర్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వివరాలు

తన

అలాగే భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, వివిధ శాఖల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఈ ప్రతిపాదనలను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL)కు పంపనుంది.

తుది ఎలైన్‌మెంట్, స్టేషన్‌ల స్థానాలు, అధికారిక ఆమోదాన్ని ఆ సంస్థ ఖరారు చేయనుంది.

వివరాలు

హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల్లో తెలంగాణ కీలక భాగస్వామ్యం

కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ (బుల్లెట్) రైలు కారిడార్లను ప్రకటించగా, అందులో మూడు హైదరాబాద్ కేంద్రంగా ఉండటం విశేషం.

ఈ ప్రాజెక్టులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మీదుగా వెళ్లనున్నాయి.

మూడు ప్రాజెక్టుల మొత్తం పొడవు 2,028 కిలోమీటర్లు కాగా, అందులో 512 కిలోమీటర్లు తెలంగాణలోనే నిర్మించనున్నారు.

దీంతో ఈ ప్రాజెక్టుల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించనుంది.

ADVERTISEMENT

వివరాలు

ప్రభుత్వ సూచనలతో మారిన ఎలైన్‌మెంట్లు

మొదట ప్రతిపాదించిన మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్పులను పరిగణనలోకి తీసుకుని ఎలైన్‌మెంట్లను సవరించారు.

హైదరాబాద్-చెన్నై కారిడార్‌ను తొలుత నార్కట్‌పల్లి-సూర్యాపేట-ఖమ్మం మీదుగా ప్రతిపాదించగా, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ-నాగార్జునసాగర్ వైపు మళ్లించారు.

హైదరాబాద్-బెంగళూరు కారిడార్ ను మొదట మహబూబ్‌నగర్-వనపర్తి రోడ్ మీదుగా ప్రతిపాదించగా, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ-మన్ననూరు-సోమశిల మార్గంలోకి మార్చారు.

ఈ మార్పులకు సంబంధించిన పూర్తి నివేదికను రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ క్యాబినెట్‌కు సమర్పించారు.

స్టేషన్లలో కీలక మార్పులు

ప్రయాణికుల సౌకర్యం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు స్టేషన్ల పేర్లు, స్థానాల్లో మార్పులు చేశారు.

ADVERTISEMENT

వివరాలు

సైబరాబాద్ స్టేషన్

తొలుత కోకాపేట పేరుతో ప్రతిపాదించిన స్టేషన్‌కు ఇప్పుడు **సైబరాబాద్** అనే పేరు నిర్ణయించారు.

స్టేషన్‌ను మొదట నిర్ణయించిన నియోపోలిస్ ప్రాంతం నుంచి పశ్చిమ దిశగా సుమారు 500 మీటర్లు మార్చే అవకాశం ఉంది.

అనంతగిరి స్టేషన్

వికారాబాద్‌లో ప్రతిపాదించిన స్టేషన్‌ను సుమారు 7 కిలోమీటర్లు మార్చి అనంతగిరి కొండల పర్యాటక ప్రాంతానికి సమీపంలో ఏర్పాటు చేయనున్నారు.

మన్ననూరు పేరుతో ప్రతిపాదించిన స్టేషన్‌ను నల్లమలగా మార్చారు.

హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభ ప్రాంతంలో ఈ స్టేషన్ నిర్మించనున్నారు.

సోమశిల స్టేషన్

అటవీ ప్రాంతాలపై ప్రభావం తగ్గేలా ఎలైన్‌మెంట్‌ను మార్చి సోమశిల సమీపంలో స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ వంతెనకు అనుసంధానంగా ఈ స్టేషన్ ఉంటుంది.

వివరాలు

4.6 కిలోమీటర్ల సొరంగ మార్గం

వికారాబాద్ సమీపంలో 4.6 కిలోమీటర్ల పొడవైన సొరంగం ద్వారా హైస్పీడ్ రైలు ట్రాక్ నిర్మించనున్నారు.

ఇది ఈ ప్రాజెక్టులో ప్రత్యేక సాంకేతిక ఆకర్షణగా నిలవనుంది.

హైదరాబాద్-చెన్నై కారిడార్ మార్గం

ఈ కారిడార్ రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి ప్రారంభమై కొత్త రేడియల్ రోడ్డు మీదుగా ప్రయాణించి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానమవుతుంది.

వివరాలు

శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ హబ్

దక్షిణ భారతదేశ హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌కు ప్రధాన కేంద్రంగా శంషాబాద్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక్కడే ప్రధాన రైల్వే స్టేషన్, రోలింగ్ స్టాక్ డిపో, వర్క్‌షాప్ ఏర్పాటు చేయనున్నారు.

అదనంగా సైబరాబాద్ స్టేషన్ సమీపంలో చిన్న రోలింగ్ స్టాక్ డిపోతో పాటు ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రణాళిక కూడా సిద్ధమైంది.

ఈ మూడు కారిడార్ల ఎలైన్‌మెంట్లు కొంత దూరం వరకు రీజినల్ రింగ్ రోడ్ (RRR)కు సమాంతరంగా సాగనున్నాయి.

వివరాలు

డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయి

హైదరాబాద్-పుణె-ముంబయి హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే రైల్వే బోర్డుకు చేరింది.

హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై కారిడార్ల డీపీఆర్‌ల రూపకల్పన కొనసాగుతోంది.

అలాగే హైస్పీడ్ రైలు స్టేషన్లను సాధ్యమైన చోట్ల మెట్రో రైలుతో అనుసంధానించనున్నారు.

భూముల మార్పిడి ప్రతిపాదన

శంషాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న 400 ఎకరాల భూమికి బదులుగా రైల్వే శాఖ మరోచోట ప్రభుత్వానికి భూమి ఇవ్వాలని ప్రతిపాదించారు.

లేకపోతే భూసేకరణకు అవసరమైన నిధులను రైల్వే శాఖ అందించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

హైస్పీడ్ రైలు నిర్మాణం వల్ల పర్యావరణంపై ప్రభావం తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.

ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు నష్టం జరగకుండా ఎలైన్‌మెంట్లలో అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వివరాలు

ప్రతిపాదిత స్టేషన్లు

హైదరాబాద్-పుణె-ముంబయి కారిడార్

హైదరాబాద్ (శంషాబాద్)

సైబరాబాద్

వికారాబాద్

హైదరాబాద్-బెంగళూరు కారిడార్

హైదరాబాద్ (శంషాబాద్)

భారత్ ఫ్యూచర్ సిటీ

ఆమనగల్లు

నల్లమల (మన్ననూరు)

సోమశిల

హైదరాబాద్-చెన్నై కారిడార్

హైదరాబాద్ (శంషాబాద్)

భారత్ ఫ్యూచర్ సిటీ

డ్రైపోర్టు

నాగార్జునసాగర్ (హాలియా)

వాడపల్లి

ADVERTISEMENT