NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ap news: వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు రద్దు చేసిన కూటమి ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    Ap news: వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు రద్దు చేసిన కూటమి ప్రభుత్వం 

    Ap news: వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు రద్దు చేసిన కూటమి ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 02, 2025
    08:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కూటమి ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్ల కోసం స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును రద్దు చేయాలని నిర్ణయించింది.

    ఈ నిర్ణయం షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ వంటి సంస్థలకు పెద్ద దెబ్బగా మారింది.

    సుమారు రూ.6,500 కోట్ల ఖర్చును వ్యర్ధంగా అభివర్ణిస్తూ ఈ ప్రాజెక్టును నిలిపివేసింది.

    18.58 లక్షల కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుపై గతంలో జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

    కానీ ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అదనపు రుణం కోసం అని చెబుతూ, షిర్డీసాయికి లాభం చేకూర్చడమే లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించిందనే ఆరోపణలు వచ్చాయి.

    ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే 50 వేల కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేశారు.

    వివరాలు 

    తీవ్ర వ్యతిరేకత మధ్య ప్రాజెక్టు 

    అయితే మిగిలిన కనెక్షన్లకు ఈ మీటర్లను అమలు చేయకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

    స్మార్ట్‌మీటర్ ఒక్కింటికి ఖర్చు రూ.35 వేలు కావడం, మొత్తం ఖర్చు రూ.6,500 కోట్లకు చేరుకోవడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

    2020లో జగన్‌ ప్రభుత్వం తొలిసారి రూ.6,480 కోట్లతో టెండర్లు పిలిచింది.

    అయితే ఈ ధరలపై ఆరోపణలు రావడంతో టెండర్లను రద్దు చేశారు. రెండోసారి పనులను విడగొట్టి వేర్వేరుగా టెండర్లు పిలిచినా, ధరలు అత్యధికంగా ఉండటం మరో విమర్శకు దారితీసింది.

    పైలట్‌ ప్రాజెక్టులు లేకుండానే, రైతుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడంపై ప్రజలు విమర్శించారు.

    వివరాలు 

    ప్రయోజనాలపై సందేహాలు 

    స్మార్ట్‌మీటర్లు విద్యుత్‌ ఆదా చేస్తాయన్న దానిపై ప్రసిద్ధ సంస్థ ప్రయాస్‌ ఎనర్జీ గ్రూప్‌ నిర్వహించిన అధ్యయనంలో నెగెటివ్‌ ఫలితాలు వచ్చాయి.

    పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్‌ మీటరింగ్‌ విధానంలో తక్కువ ఖర్చుతోనే విద్యుత్‌ వినియోగాన్ని అంచనా వేయవచ్చని సూచించారు.

    శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టులో ఐఆర్‌డీఏ మీటర్ల ద్వారా 28-36% రాయితీ ఆదా చేశామన్న లెక్కలను జగన్‌ ప్రభుత్వం ప్రస్తావించినా, ప్రజలకు భారం పెరుగుతుందన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి.

    ప్రస్తుత నిర్ణయం

    కూటమి ప్రభుత్వం స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును ఆపేయడంతో రైతులకు కాస్త ఊరట లభించనుంది.

    విపరీత ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టును నిలిపివేయడమే ప్రజల ప్రయోజనాలను కాపాడే మార్గమని భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ మార్కెట్లోకి రాకకు సిద్ధం ఆటో మొబైల్
    Monsoon: రైతులకు ఊరట.. కేరళకు తాకిన రుతుపవనాలు! భారత వాతావరణ శాఖ
    Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్ బ్యాడ్మింటన్
    Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్ టాలీవుడ్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌పోర్టల్‌ ద్వారా క్షణాలలో దస్తావేజు నకళ్లు, ఈసీలు  భారతదేశం
    AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక అంశాలపై చర్చ.. వాటికి లైన్‌ క్లియర్‌ భారతదేశం
    Amaravati: అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం  భారతదేశం
    Men group: ఏపీలో డ్వాక్రా సంఘాల మాదిరిగా పురుషుల గ్రూపుల ఏర్పాటు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025