Page Loader
CBSE: ఓపెన్ బుక్ పరీక్ష నివేదికను కొట్టేసిన సీబీఎస్‌ఈ, నకిలీ వార్తలపై నోటీసు జారీ 
ఓపెన్ బుక్ పరీక్ష నివేదికను కొట్టేసిన సీబీఎస్‌ఈ,నకిలీ వార్తలపై నోటీసు జారీ

CBSE: ఓపెన్ బుక్ పరీక్ష నివేదికను కొట్టేసిన సీబీఎస్‌ఈ, నకిలీ వార్తలపై నోటీసు జారీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీబీఎస్‌ఈ (CBSE) వచ్చే ఏడాది జరగనున్న 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే వార్తలపై స్పందించింది. 2025లో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలలో 15 శాతం సిలబస్ తగ్గించడం, కొంతమంది సబ్జెక్టులలో ఓపెన్ బుక్‌ పరీక్షలు నిర్వహించబోతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు కొట్టిపారేసింది. ఈ మేరకు, ఈ రకమైన అనధికారిక సమాచారంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సీబీఎస్‌ఈ సూచించింది.

వివరాలు 

తప్పుదోవపట్టించే వార్తలను విశ్వసించవద్దు:  సీబీఎస్‌ఈ 

"ఈ సంవత్సరం 10, 12 పరీక్షల విధానంలో ఎటువంటి మార్పులూ చేయలేదు" అని, సీబీఎస్‌ఈ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అలాగే, 2025 బోర్డు పరీక్షలకు సంబంధించిన అధికారిక సమాచారం తమ వెబ్‌సైట్‌లోనే విడుదల చేస్తామని చెప్పింది. అందువల్ల, ఇలాంటి తప్పుదోవపట్టించే వార్తలను విశ్వసించవద్దని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, సీబీఎస్‌ఈ త్వరలోనే 10, 12వ తరగతి పరీక్షల డేట్‌షీట్‌ను విడుదల చేయనుంది. సాధారణంగా నవంబర్‌లో ఈ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. గతంలో ఉన్న ట్రెండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈసారి కూడా ఫిబ్రవరి 15 నుండి బోర్డు పరీక్షలు ప్రారంభం కావచ్చు.