NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్
    భారతదేశం

    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 27, 2022, 10:10 am 1 నిమి చదవండి
    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్
    కరోనా ప్రబలకుండా కేంద్రం ముందస్తు జాగ్రత్తలు

    దేశంంలో కరోనా కేసులు పెరుగుదల పెద్దగా లేకపోయినా..కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండో వేవ్‌లో తలెత్తిన పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేలా దేశవ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కేంద్రం సంసిద్ధం చేస్తోంది. ఇందుకోసం మంగళవారం అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆరోగ్యమంత్రి మాండవీయా ఆదేశించారు. దేశంలో మరో వేవ్ వచ్చినా.. తక్కువ ప్రభావాన్ని చూపేలా.. ఐఎంఏ సైతం కేంద్రానికి కీలక సూచనలు చేసింది. రెండో బూస్టర్ డోస్‌కు అనుమతి ఇవ్వాలని ఐఎంఏ కోరింది. మొదటి బూస్టర్ డోస్ తీసుకోని వారు.. వీలైనంత త్వరగా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వైరస్ వ్యాప్తిపై తప్పుడు సమాచారాన్ని ఇస్తున్న'ఇన్ఫోడెమిక్'ను కట్టడి చేయాలని చెప్పింది.

    రాష్ట్రాల స్థాయిలో కూడా చర్యలు

    రాష్ట్రాలు కూడా కరోనా కట్టడికి తమ స్థాయిలో వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. సౌకర్యాలను పెంచాలని సూచించారు. వైద్యులు, నర్సులు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఫీల్డ్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వేడుకలను రాత్రి1 గంటకు ముగించాలని చెప్పింది. వేడుకల సమయంలో మాస్క్‌లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలను కేంద్రం వేగవంతం చేసింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే వారికి ఆర్టీపీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కోవిడ్
    మన్‌సుఖ్ మాండవీయ

    తాజా

    7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం బడ్జెట్ 2023
    భవిష్యత్తులో అంగారక గ్రహంపై 'కాంక్రీట్' లాగా ఉపయోగపడనున్న బంగాళదుంపలు గ్రహం
    ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫ్లిప్ కార్ట్
    రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి కర్ణాటక

    కోవిడ్

    కరోనాపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం; ఏప్రిల్ 10,11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌ తాజా వార్తలు
    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం భారతదేశం
    దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు భారతదేశం
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నరేంద్ర మోదీ

    మన్‌సుఖ్ మాండవీయ

    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' కోవిడ్
    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కరోనా కొత్త మార్గదర్శకాలు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023