NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్
    తదుపరి వార్తా కథనం
    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్
    కరోనా ప్రబలకుండా కేంద్రం ముందస్తు జాగ్రత్తలు

    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

    వ్రాసిన వారు Stalin
    Dec 27, 2022
    10:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంంలో కరోనా కేసులు పెరుగుదల పెద్దగా లేకపోయినా..కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండో వేవ్‌లో తలెత్తిన పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేలా దేశవ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కేంద్రం సంసిద్ధం చేస్తోంది. ఇందుకోసం మంగళవారం అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆరోగ్యమంత్రి మాండవీయా ఆదేశించారు.

    దేశంలో మరో వేవ్ వచ్చినా.. తక్కువ ప్రభావాన్ని చూపేలా.. ఐఎంఏ సైతం కేంద్రానికి కీలక సూచనలు చేసింది. రెండో బూస్టర్ డోస్‌కు అనుమతి ఇవ్వాలని ఐఎంఏ కోరింది. మొదటి బూస్టర్ డోస్ తీసుకోని వారు.. వీలైనంత త్వరగా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వైరస్ వ్యాప్తిపై తప్పుడు సమాచారాన్ని ఇస్తున్న'ఇన్ఫోడెమిక్'ను కట్టడి చేయాలని చెప్పింది.

    కరోనా

    రాష్ట్రాల స్థాయిలో కూడా చర్యలు

    రాష్ట్రాలు కూడా కరోనా కట్టడికి తమ స్థాయిలో వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. సౌకర్యాలను పెంచాలని సూచించారు. వైద్యులు, నర్సులు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఫీల్డ్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

    న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వేడుకలను రాత్రి1 గంటకు ముగించాలని చెప్పింది. వేడుకల సమయంలో మాస్క్‌లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులను తప్పనిసరి చేసింది.

    విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలను కేంద్రం వేగవంతం చేసింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే వారికి ఆర్టీపీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025