Page Loader
Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం

Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2024
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన చేసిన అమూల్యమైన సేవలను గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం దిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని నిర్ణయించింది. ఈ సమాచారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డాక్టర్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షా కేబినెట్ సమావేశం తర్వాత స్మారక చిహ్నం నిర్మాణానికి స్థల కేటాయింపుపై సానుకూల నిర్ణయం ప్రకటించారు.

Details

స్థలం కేటాయించడంలో జాప్యంపై అసంతృప్తి

హోం మంత్రిత్వ శాఖ ప్రకటనలో డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను గుర్తించి, ఈ స్మారక చిహ్నం నిర్మించనున్నట్లు తెలియజేశారు. డాక్టర్ సింగ్ 2004 నుండి 2014 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆయన సేవలను స్మరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ స్మారక చిహ్నం నిర్మాణం డిమాండ్ చేసింది. అయితే స్థలం కేటాయించడంలో జాప్యం పట్ల కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది భారత తొలి సిక్కు ప్రధానమంత్రిపై అవమానం కాదా? అని ప్రశ్నించింది. స్మారక చిహ్నం నిర్మాణం నిర్ణయం డాక్టర్ సింగ్ సేవలను గౌరవించేందుకు తీసుకున్న ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు.