NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / DOPT: తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు భారీ షాక్.. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాల్సిందేనంటూ.. 
    తదుపరి వార్తా కథనం
    DOPT: తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు భారీ షాక్.. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాల్సిందేనంటూ.. 
    తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు భారీ షాక్.

    DOPT: తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు భారీ షాక్.. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాల్సిందేనంటూ.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 11, 2024
    08:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినా, కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (సీఏటీ) ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

    అలాగే, తెలంగాణకు కేటాయించి, ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఐఏఎస్‌ అధికారులను తెలంగాణలో రిపోర్టు చేయాలని స్పష్టంగా చెప్పింది.

    ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) విభాగం కార్యదర్శి తాజా ఆదేశాలు ఇచ్చారు.

    ఆదేశాల ప్రకారం, తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సి ఉంది.

    ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు తెలంగాణకు రావాల్సి ఉంటుంది.

    వివరాలు 

    వాణీప్రసాద్, వాకాటి కరుణ, ఆమ్రపాలి... జాబితాలో ఉన్నవారు 

    ఏపీకి కేటాయించినా, తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్‌ అధికారుల్లో వాణీప్రసాద్,వాకాటి కరుణ, రొనాల్డ్‌రాస్,ఆమ్రపాలి,ప్రశాంతి ఉన్నారు.

    ఐపీఎస్‌ అధికారుల్లో అంజనీకుమార్,అభిలాష్‌ బిస్త్,అభిషేక్‌ మహంతి ఉన్నారు.

    వాణీప్రసాద్‌ యువజన, క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శిగా, వాకాటి కరుణ మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా, రొనాల్డ్‌ రాస్‌ ఇంధన శాఖ కార్యదర్శిగా, ట్రాన్స్‌కో సీఎండీగా, ఆమ్రపాలి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.

    ప్రశాంతి త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. డీఓపీటీ ఆదేశాలపై ఈ అధికారులు కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

    ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు రావాల్సిన ఐఏఎస్‌ అధికారుల్లో సృజన, శివశంకర్, హరికిరణ్‌ ఉన్నారు.

    ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలని దరఖాస్తు చేసిన ఎస్‌.ఎస్‌.రావత్‌, అనంతరాముల అభ్యర్థనలను డీఓపీటీ తిరస్కరించింది. ఈ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగుతారు.

    వివరాలు 

    క్యాట్‌ ఆదేశాలతో

    ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన సమయంలో, సంబంధిత చట్టం ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులను డీఓపీటీ రెండు రాష్ట్రాలకు విభజించింది.

    ఈ కేటాయింపులు సరిగా జరగలేదంటూ, తెలంగాణలో పనిచేస్తున్న పలువురు అధికారులు అప్పట్లోనే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు.

    ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు వారు తెలంగాణలో కొనసాగారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్‌ కుమార్‌ విషయంలోనూ ఇదే జరిగింది.

    హైకోర్టు క్యాట్‌ ఆదేశాలను కొట్టివేసిన తర్వాత, ఆయన తెలంగాణ నుంచి రిలీవ్‌ అయి ఆంధ్రప్రదేశ్‌లో చేరి వెంటనే వీఆర్‌ఎస్‌ తీసుకొన్నారు.

    వివరాలు 

    ఏకసభ్య కమిటీని నియమించిన డీఓపీటీ 

    మిగిలిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కేటాయింపును పునఃసమీక్షించాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు కేసును మూసివేసింది.

    ఈ నేపథ్యంలో, డీఓపీటీ మార్చి 21న ఏకసభ్య కమిటీని నియమించింది.

    దీని ఆధారంగా, జూన్‌లో ఆ అధికారులను వ్యక్తిగతంగా విచారించి, వారి అభ్యర్థనలను తిరస్కరించింది.

    ఈ మేరకు, డీఓపీటీ తెలంగాణలో రిలీవ్‌ అయిన అధికారులకు ఈ నెల 16వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    తెలంగాణ

    Telangana: 'వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డు' విధానం.. తెలంగాణలో రేషన్, ఆరోగ్య సేవలకు ఒకే కార్డు  రేవంత్ రెడ్డి
    Telangana: అన్నదాతకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక అప్డేట్ భారతదేశం
    Telangana: హరిత ఇంధన ఉత్పత్తి, వినియోగానికి తెలంగాణలో పుష్కలంగా అవకాశాలు.. ఎంఎన్‌ఆర్‌ఈ వెల్లడి భారతదేశం
    Hydra: చెరువుల రక్షణకు 'హైడ్రా' పక్కా ప్రణాళిక.. 45 ఏళ్ల నాటి చిత్రాల సేకరణ హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    Murder: ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు హత్య
    Praksam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి ప్రకాశం జిల్లా
    Sonusood: చంద్రబాబు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు : సోనుసూద్  చంద్రబాబు నాయుడు
    Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో విధానం ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025