NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Flood Effects: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేడు కేంద్ర బృందం పర్యటన
    తదుపరి వార్తా కథనం
    Flood Effects: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేడు కేంద్ర బృందం పర్యటన
    వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేడు కేంద్ర బృందం పర్యటన

    Flood Effects: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేడు కేంద్ర బృందం పర్యటన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2024
    11:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖమ్మం, మహబూబాబాద్‌తో పాటు సూర్యాపేట, భద్రాద్రి, వనపర్తి, నారాయణపేట, మెదక్ వంటి జిల్లాలలో ఆగస్టు 30, 31 తేదీలలో కురిసిన వర్షాల కారణంగా అనేక గ్రామాలు విపత్తుకు గురయ్యాయి.

    బుధవారం క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్న కేంద్ర బృందం తమ ఆర్తిని తీర్చడం, భరోసా ఇవ్వడం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు.

    ఇనుగుర్తి మండలం,మహబూబాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వర్షపాతం 45.6 సెం.మీ. నమోదైంది.

    ఈ జిల్లాలోని నెల్లికుదురు,చిన్నగూడూరు,మరిపెడ, కురవి, సీరోలు, డోర్నకల్, నర్సింహులపేట మండలాలు వరద భయం నుండి ఇప్పటికీ తేరుకోలేదు.

    210 గ్రామాలకు ముంపు బారిన పడగా, అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. వాగులు, పెద్ద వంకలేని మహబూబాబాద్ జిల్లా కేంద్రం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది.

    వివరాలు 

    300 పశువులు మృతి

    పెద్దఎత్తున ఉన్న చెరువులన్నీ ఒక్కసారిగా అలుగు పోవడం, ఆ వరద ఆకేరు, మున్నేరు నదుల్లో కలవాల్సి ఉండగా ఊర్లలోకి పోటెత్తడం వల్ల జిల్లాలో అపార నష్టం సంభవించింది.

    300 పశువులు మృతి చెందినట్లు ఇప్పటివరకు సేకరించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి.

    కేంద్ర విపత్తు నిర్వహణ అధికారుల బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది.

    ఆరుగురు సభ్యులతో కూడిన ఈ బృందం రాష్ట్రంలో ఇటీవల వరదలు సంభవించిన జిల్లాల్లో పర్యటించనుంది.

    తొలుత బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల మంత్రులతో, అధికారులతో సమావేశం నిర్వహించనుంది.

    అనంతరం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది. అక్కడ బాధితులతో, రైతులతో మాట్లాడనుంది.

    కేంద్ర బృందం రెండు జట్లుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

    వివరాలు 

    రెండు బృందాలుగా క్షేత్రస్థాయి పర్యటన 

    కేంద్ర విపత్తు నిర్వహణ అధికారుల బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకుంది.

    ఆరుగురు సభ్యులతో కూడిన ఈ బృందం రాష్ట్రంలోని ఇటీవల వరదలు సంభవించిన జిల్లాల్లో పర్యటించనుంది.

    బుధవారం ఉదయం, రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల మంత్రులతో, అధికారులతో సమావేశం నిర్వహించి,అనంతరం ఖమ్మం,సూర్యాపేట,మహబూబాబాద్‌ జిల్లాల్లో పర్యటించనుంది.

    అక్కడ, బాధితులు,రైతులతో మాట్లాడనుంది. కేంద్ర బృందం రెండు జట్లుగా విడిపోయి, క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

    ఆగస్టు 30,31తేదీల్లో కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం నగరం తీవ్రంగా కుదేలైంది. సెప్టెంబరు 1వ తేదీ ఉదయానికే నగరాన్ని వరద చుట్టుముట్టడంతో 22కాలనీలు,బస్తీలు మునిగిపోయాయి.

    మున్నేరు నదికి 37అడుగుల స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి. ఆ వరద ఉప్పెనలా దూసుకురావడంతో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది.

    వివరాలు 

    1.52 లక్షల మంది వరద ప్రభావితులు

    వేల ఇళ్లలోకి వరద చేరింది. ఆ ప్రవాహానికి ఇళ్లలో ఉన్నదంతా కొట్టుకుపోయింది.కాల్వ సమీపంలో నివసించే నిరుపేదల గుడిసెలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

    నదికి ఒకవైపు ఐదు కిలోమీటర్ల వరకు వరద పోటెత్తింది.నష్టాన్ని అంచనా వేయడానికి సర్వే జరుగుతోంది.

    ప్రాథమిక సమాచారం ప్రకారం,1.52 లక్షల మంది వరద ప్రభావితులుగా నమోదు అయ్యారు.15వేల కుటుంబాలు వివిధ స్థాయిలో నష్టపోయాయి.

    ఖమ్మం గ్రామీణ మండలంలో,గ్రామాలను, చెలకలను, పొలాలను వరద ముంచెత్తింది.

    ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండా రూపురేఖలు మారిపోయాయి.

    ఆకేరు ఉద్ధృతికి ఈ మండలంలో వందల ఎకరాల్లో ఇసుక, రాళ్ళు మేటలు వేసాయి.

    జిల్లాలో పది వేల పశువులు మృతి చెందాయని అంచనా. 66 పాఠశాలల భవనాలు, 50 చెరువులు, 56 వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    తెలంగాణ

    Telangana:తెలంగాణ డిస్కంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం  భారతదేశం
    Telangana: అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఐఎండీ
    Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం ఇండియా
    Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025