LOADING...
AI Impact Summit: ఫిబ్రవరి 21 వరకూ ఏఐ సమ్మిట్: ఐటీ కార్యదర్శి కృష్ణన్
ఫిబ్రవరి 21 వరకూ ఏఐ సమ్మిట్: ఐటీ కార్యదర్శి కృష్ణన్

AI Impact Summit: ఫిబ్రవరి 21 వరకూ ఏఐ సమ్మిట్: ఐటీ కార్యదర్శి కృష్ణన్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026ను మరో రోజు పెంచుతూ ఫిబ్రవరి 21 వరకూ పొడిగిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ ఫిబ్రవరి 18న వెల్లడించారు. శనివారం అయిన ఫిబ్రవరి 21న కూడా సమ్మిట్ కొనసాగుతుందని, ఆ రోజు సాధారణ ప్రజలకు ప్రవేశం ఉంటుందని తెలిపారు. అలాగే సమ్మిట్ వ్యవధిని మరో రెండు గంటలు పెంచినట్లు చెప్పారు. భారీ స్పందన రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కృష్ణన్ వివరించారు. ప్రజల కోసం ఒక పూర్తి రోజు కేటాయించాలన్నదే ఉద్దేశమని, విద్యార్థులు తదితరులు వచ్చి చూడొచ్చని పేర్కొన్నారు. ఎక్స్‌పో ప్రాంతం రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంటుందని, కన్వెన్షన్ సెంటర్ సాయంత్రం 4.30 గంటలకు మూసివేస్తామని తెలిపారు.

వివరాలు 

ఆ రోజు సమ్మిట్‌కు రావద్దని ప్రజలకు సూచన

ఫిబ్రవరి 19న భారత్ మండపంలో పరిమిత కార్యక్రమాలు ఉండటంతో ఆ రోజు సమ్మిట్‌కు రావద్దని ప్రజలకు సూచించారు. అయితే ఫిబ్రవరి 20, 21తేదీల్లో ఎక్స్‌పో ప్రజలకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. గాల్గోటియాస్ యూనివర్సిటీ అంశంపై కూడా వివరణ ఇచ్చిన కృష్ణన్,సమ్మిట్‌లో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని,నిజమైన పనులు మాత్రమే ప్రదర్శించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. తప్పుడు సమాచారం లేదా నకిలీ పనులను ప్రోత్సహించబోమని తెలిపారు. ఒక్క అంశం చుట్టూ వచ్చిన వివాదాలు ఇతరులు చేసిన అద్భుతమైన పనిని మసకబార్చకూడదని, సరైన నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. పలు సంస్థలు,స్టార్టప్‌లు మంచి ప్రదర్శనలతో ముందుకు వచ్చాయని,వారి శ్రమ, కొత్త ఆవిష్కరణలే ప్రధానంగా కనిపించాలన్నదే తమ ఉద్దేశమని ఐటీ కార్యదర్శి చెప్పారు.

Advertisement