NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: 'స్వర్ణ కుప్పం'.. విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: 'స్వర్ణ కుప్పం'.. విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    'స్వర్ణ కుప్పం'.. విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

    Chandrababu: 'స్వర్ణ కుప్పం'.. విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 06, 2025
    02:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రం వెనుకబడిపోయిందని, అప్పుల భారంతో నడుస్తోందని టీడీపీ అధినేత. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

    కష్టపడి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో హైదరాబాద్‌లో తన హయాంలో చేసిన అభివృద్ధి కారణంగానే ప్రస్తుతం ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు.

    2014-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశలో ముందుకు నడిపించామని చెప్పారు.

    ద్రవిడ యూనివర్సిటీలో నిర్వహించిన 'స్వర్ణ కుప్పం- విజన్ 2029' డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు

    ప్రతి ఇంటికీ పారిశ్రామికవేత్త ఉండాలనేదే తన ప్రధాన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.

    వివరాలు 

    స్థానికులకు ఉపాధి అవకాశాలు

    ఆయన మాట్లాడుతూ, "రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం. ఏటా చేపట్టవలసిన పనుల గురించి చర్చించాం. కుప్పంలో పెట్టుబడులను ఆకర్షించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జీవితం ఎవరికీ జాక్‌పాట్ కాదు; ఒకసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైకుంఠపాళి తరహా పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇది రాజకీయాలు, వ్యాపారం సహా అన్ని రంగాలకు వర్తిస్తుంది" అని అన్నారు.

    వివరాలు 

    నియోజకవర్గాల వారీగా ప్రత్యేకమైన విజన్

    "ఈసారి నియోజకవర్గాల వారీగా ప్రత్యేకమైన విజన్ రూపొందిస్తున్నాం. ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చగలగడం ద్వారా నాయకులు శాశ్వతంగా ప్రజల మద్దతు పొందగలరు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కుప్పంలో టీడీపీ జెండా మినహా మరే పార్టీ జెండా ఎగరలేదు. ప్రతి ఎన్నికలో ప్రజలు మాకు విశ్వాసం చూపించి గెలిపించారు. కుప్పం ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నా ధన్యవాదాలు. విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటిలోనూ దీనిపై చర్చలు జరగాలి. యువత ఉద్యోగాలు చేయడమే కాదు, ఇవ్వాలని కూడా ఆలోచించాలి," అని చంద్రబాబు అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Theatres bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్ టాలీవుడ్
    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు నీతి ఆయోగ్
    Chandrababu: 'ఉచిత గ్యాస్ సిలిండర్' పథకం ప్రారంభం..  టీ చేసిన సీఎం  ఆంధ్రప్రదేశ్
    Chandrababu: తిరుపతిలో బాలికపై హత్యాచార ఘటన.. స్పందించిన సీఎం చంద్రబాబు తిరుపతి
    Chandra Babu: విశాఖ-అమరావతి మార్గంలో వేగవంతమైన మార్పులు : చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025