NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharastra: మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. కాంట్రాక్టర్ పై కేసు 
    తదుపరి వార్తా కథనం
    Maharastra: మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. కాంట్రాక్టర్ పై కేసు 
    మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం

    Maharastra: మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. కాంట్రాక్టర్ పై కేసు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 27, 2024
    10:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని కోటలో సోమవారం నాడు మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 35 అడుగుల ఎత్తైన విగ్రహం కూలిపోయింది.

    ఈ మేరకు ఓ అధికారి సమాచారం ఇచ్చారు. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

    మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోట వద్ద మధ్యాహ్నం 1 గంట సమయంలో విగ్రహం కూలిపోయిందని అధికారి తెలిపారు.

    విగ్రహం కూలిపోవడానికి అసలు కారణాన్ని నిపుణులు కనుగొంటారని చెప్పారు. అయితే గత రెండు మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయని తెలిపారు.

    గతేడాది డిసెంబరు 4న నేవీ డే వేడుకల సందర్భంగా అట్టహాసంగా ఆవిష్కరించిన 35 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.

    వివరాలు 

    కాంట్రాక్టర్,నిర్మాణ సలహాదారుపై ఎఫ్‌ఐఆర్ నమోదు

    మహారాష్ట్రలోని సింధుదుర్గ్ లో సోమవారం 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూలిన ఘటనలో కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టే, నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్‌లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

    "ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఘటనలో కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టే, నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్‌పై స్థానిక పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 109, 110, 125, 318, 3(5) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు" అని సింధుదుర్గ్ పోలీసులు తెలిపారు.

    8 నెలల క్రితం నేవీ డే రోజున ఆవిష్కరించిన ఈ విగ్రహం సింధుదుర్గ్ పౌరులకు అంకితం చేయబడింది. ఈ ఘటనకు గల కారణాలను పరిశీలిస్తామని భారత నౌకాదళం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

    వివరాలు 

     ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పునఃస్థాపిస్తాం: షిండే 

    బలమైన గాలుల కారణంగానే విగ్రహం కూలిపోయిందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.

    విగ్రహం కూలిపోయిన ఘటన వెనుక గల కారణాలను మహారాష్ట్ర ప్రభుత్వం కనిపెట్టి, అదే స్థలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పునఃస్థాపిస్తుందని షిండే తెలిపారు.

    జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ విగ్రహాన్ని నౌకాదళం ఏర్పాటు చేసింది. వారే డిజైన్ కూడా చేశారు. కానీ గంటకు 45 కి.మీ వేగంతో బలమైన గాలులు వీయడంతో అది పడిపోయి దెబ్బతిందన్నారు.

    సంఘటన జరిగిన వెంటనే పబ్లిక్ వర్క్స్ మంత్రి రవీంద్ర చవాన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి షిండే ఆదేశాల మేరకు విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను పరిశీలించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మహారాష్ట్ర

    Pune Porsche accident: పూణే కారు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ .. రక్త నమూనాలను మార్చడానికి మూడు లక్షలు లంచం  భారతదేశం
    Pune: పూనే పోర్ష్ కారు ప్రమాదం.. యువకుని తల్లి అరెస్టు భారతదేశం
    Pune: పోర్ష్ కారు ప్రమాదం.. నన్ను పెద్దవాడిగా గుర్తించి విచారించండి మహో ప్రభో  భారతదేశం
    Sukhoi Jet Crash: నాసిక్‌లో కూలిన సుఖోయ్ యుద్ధ విమానం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025