Loading...
Defence Ministry: సరిహద్దుల్లో చైనా దూకుడు తగ్గింది.. భారీగా తగ్గిన సైనిక మోహరింపులు
సరిహద్దుల్లో చైనా దూకుడు తగ్గింది.. భారీగా తగ్గిన సైనిక మోహరింపులు

Defence Ministry: సరిహద్దుల్లో చైనా దూకుడు తగ్గింది.. భారీగా తగ్గిన సైనిక మోహరింపులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా సైనిక మోహరింపులు గణనీయంగా తగ్గినట్లు రక్షణ శాఖ (Defence Ministry) వెల్లడించింది. 2025లో ఉత్తర సరిహద్దుల్లో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (PLA) బలగాల మోహరింపులు భారీగా తగ్గాయని తన 2025-26 వార్షిక నివేదికలో పేర్కొంది. 2020లో తూర్పు లద్దాఖ్‌లో LAC వెంబడి భారత్‌-చైనా సైనిక బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత 2024లో ఆయా ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైనిక దళాల ఉపసంహరణకు సంబంధించి అవగాహన కుదిరింది. ఈ అంశంపై గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య చర్చలు కూడా జరిగాయి.

వివరాలు

ఉద్రిక్తతలు కొంతమేర తగ్గాయి

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొంత మేరకు తగ్గినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చైనా సరిహద్దులకు ఇరువైపులా చెరో 10 కంబైన్డ్‌ ఆర్మ్స్‌ బ్రిగేడ్లను మోహరించింది.

వీటిలో సుమారు 40,000 నుంచి 50,000 మంది సైనికులు ఉన్నట్లు రక్షణ శాఖ నివేదికలో పేర్కొంది. అంతకుముందు లద్దాఖ్‌ సెక్టార్‌లోనే చైనాకు చెందిన 60,000 మందికి పైగా సైనికులు మోహరించి ఉండేవారు.

బీజింగ్‌ తన సైనిక మోహరింపులను తగ్గించినప్పటికీ.. భారత్‌ మాత్రం అప్రమత్తతను కొనసాగిస్తోంది.

LAC పొడవునా అన్ని సెక్టార్లలో పటిష్టమైన సైనిక వ్యూహాన్ని, సంసిద్ధతను కొనసాగిస్తోంది.

భవిష్యత్తులో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.

వివరాలు

జమ్మూలో పటిష్ట భద్రత..

గత కొంతకాలంగా భారత్‌-చైనా మధ్య కొనసాగుతున్న రాజకీయ, దౌత్య చర్చల కారణంగానే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి స్థిరత్వం నెలకొందని రక్షణ శాఖ తెలిపింది.

భారత సైన్యం (Indian Army) అవిశ్రాంతంగా చేస్తున్న కృషి కారణంగా జమ్మూకశ్మీర్‌ (Jammu And Kashmir)లో శాంతిభద్రతలు నెలకొన్నాయని రక్షణ శాఖ తన నివేదికలో పేర్కొంది.

అక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. జమ్మూకశ్మీర్‌ ప్రజలు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారని, ప్రభుత్వం, భారత సైన్యం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని నివేదిక వెల్లడించింది.

ఫలితంగా కశ్మీర్‌లో రాళ్ల దాడులు, నిరసనలు, హింసాత్మక ఘటనలు పూర్తిగా తగ్గిపోయాయని పేర్కొంది.

ADVERTISEMENT