NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం
    మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం
    భారతదేశం

    మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం

    వ్రాసిన వారు Naveen Stalin
    April 04, 2023 | 10:23 am 1 నిమి చదవండి
    మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం
    అరుణాచల్‌ప్రదేశ్‌లోని 11ప్రదేశాలకు 'దక్షిణ టిబెట్‌'గా పేరు మార్చిన చైనా

    'కుక్క తోక వంకర' అన్న చందంగా చైనా వ్యవహరిస్తోంది. మరోసారి డ్రాగన్ దేశం అరుణాచల్ ప్రదేశ్‌లో కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు 'దక్షిణ టిబెట్‌'గా పేరు మార్చి చైనా మరోసారి తన వంకర బుద్ధిని చాటుకుంది. తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై తమ హక్కును నొక్కిచెప్పడానికి చైనా ఈ కొత్త నక్క జిత్తుల ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. స్టేట్ కౌన్సిల్, చైనా క్యాబినెట్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలను అనుసరించి చైనీస్, టిబెటన్, పిన్యిన్ అక్షరాల్లో 11 ప్రదేశాల పేర్లను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

    చైనా చర్యను ఖండించిన భారత్

    చైనా 11పేర్లతో విడుదల చేసిన ఈ జాబితాలో రెండు భూభాగాలు, రెండు నివాస ప్రాంతాలు, ఐదు పర్వత శిఖరాలు, రెండు నదులు, వాటి అధీన పరిపాలనా జిల్లాల కోసం ఖచ్చితమైన కో ఆర్డినేట్‌లు ఉన్నాయి. చైనా ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేయగా, తాజాగా మూడో జాబితాను ప్రకటించింది. 2017లో ఆరు ప్రదేశాలు, 2021లో 15ప్రదేశాలు, ఇప్పుడు 11 ప్రదేశాలు తమవే అని చైనా ప్రకటించినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని స్థలాల పేరు మార్చడానికి చైనా చేసిన చర్యను భారత్ వ్యతిరేకించింది. ఆ రాష్ట్రం ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందని, సృష్టించిన పేర్లు వాస్తవాన్ని మార్చలేవని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఉద్ఘాటించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    చైనా
    అరుణాచల్ ప్రదేశ్
    భారతదేశం
    తాజా వార్తలు

    చైనా

    బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడు; దలైలామా పట్టాభిషేకం! దలైలామా
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం అరుణాచల్ ప్రదేశ్

    అరుణాచల్ ప్రదేశ్

    అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు యుద్ధ విమానాలు
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం రాజ్‌నాథ్ సింగ్
    అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూ ప్రకంపణలు భూకంపం

    భారతదేశం

    ఏప్రిల్ 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సూపర్‌కార్‌ను కొనుగోలు చేసిన హైదరాబాదీ ఆటో మొబైల్
    SBI బ్యాంక్ UPI, నెట్ బ్యాంకింగ్ సేవలలో సర్వర్ అంతరాయంతో నష్టపోతున్న వినియోగదారులు బ్యాంక్
    ఫిబ్రవరి 2023లో 45 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్ వాట్సాప్

    తాజా వార్తలు

    బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    10వ తరగతి తెలుగు పేపర్ లీక్; ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు తెలంగాణ
    దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు మనీష్ సిసోడియా
    'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ నిర్మలా సీతారామన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023