NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Climate change: వేడెక్కుతున్న భారత్-పాకిస్థాన్.. గుండెపోటు ముప్పులో 220కోట్ల మంది ప్రజలు.. పరిశోధనలో వెల్లడి
    తదుపరి వార్తా కథనం
    Climate change: వేడెక్కుతున్న భారత్-పాకిస్థాన్.. గుండెపోటు ముప్పులో 220కోట్ల మంది ప్రజలు.. పరిశోధనలో వెల్లడి
    వేడెక్కుతున్న భారత్-పాకిస్థాన్.. గుండెపోటు ముప్పులో 220కోట్ల మంది ప్రజలు.. పరిశోధనలో వెల్లడి

    Climate change: వేడెక్కుతున్న భారత్-పాకిస్థాన్.. గుండెపోటు ముప్పులో 220కోట్ల మంది ప్రజలు.. పరిశోధనలో వెల్లడి

    వ్రాసిన వారు Stalin
    Oct 10, 2023
    02:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాతావరణ మార్పులకు సంబంధించిన ఓ పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది.

    గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు ఇప్పటికే తారాస్థాయికి చెరుకున్నాయని, ఈ శతాబ్దం చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయం పేర్కొంది.

    గ్లోబల్ వార్మింగ్ వల్ల భారతదేశం, పాకిస్థాన్, సింధు లోయతో సహా ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన కొన్ని ప్రాంతాలకు చెందిన 220కోట్ల మంది గుండెపోటు, హీట్ స్ట్రోక్‌ ముప్పుపొంచి ఉన్నదని ఈ పరిశోధన అంచనా వేసింది.

    పెన్సిల్వేనియాకు చెందిన పర్డ్యూ యూనివర్శిటీలోని ఎర్త్, అట్మాస్ఫియరిక్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ పరిశోధకులు చేసిన అధ్యయనం 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' జర్నల్‌లో ప్రచురితమైంది.

    వేడి

    1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రతలు పెరిగితే వినాశనమే..

    ప్రపంచ భూ ఊపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే 1.5డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడెక్కడం మానవ ఆరోగ్యానికి వినాశకరమైనదని పరిశోధన వెల్లడించింది.

    ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్‌ కంటే పెరిగితే, పాకిస్థాన్, భారతదేశంలోని సింధు నదీ లోయలో 2.2 బిలియన్ల ప్రజలు, తూర్పు చైనాలో 1 బిలియన్ మంది, ఆఫ్రికాలో 800మిలియన్ల మంది ప్రజలు వేడి ముప్పును ఎదుర్కొంటారని ఈ అధ్యయనం సూచిస్తుంది.

    అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే ప్రధాన నగరాల్లో దిల్లీ, కోల్‌కతా, షాంఘై, ముల్తాన్, నాన్‌జింగ్, వుహాన్ ఉన్నాయి.

    ఈ ప్రాంతాలు తక్కువ, మధ్య-ఆదాయ దేశాలు అయినందున, ప్రజలు ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి ఎయిర్ కండిషనర్లు, ఇతర ఉపశమన మార్గాలను పొందడానికి అవకాశం ఉండకపోవచ్చని అధ్యయనం పేర్కొంది.

    వేడి

    అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉష్ణోగ్రతల పిడుగు

    గ్లోబల్ వార్మింగ్ వల్ల మరో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగితే, తూర్పు సముద్ర తీరం, యునైటెడ్ స్టేట్స్ మధ్య భాగం తీవ్రంగా ప్రభావితం అవుతాయని అధ్యయం చెబుతోంది.

    దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా కూడా విపరీతమైన వేడిని అనుభవిస్తున్నాయని పరిశోధనలో తేలింది.

    కానీ అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే తక్కువ బాధను అనుభవిస్తారు.

    ఈ ప్రదేశాల్లోని వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు చనిపోయే ప్రమాదం ఉంది.

    సంపన్న దేశాల కంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా తక్కువ గ్రీన్‌హౌస్, ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ అవి ఉష్ణోగ్రతల ముప్పును ఎదుర్కోనున్నట్లు అధ్యయనం వెల్లడించింది.

    తత్ఫలితంగా, కోట్లాది మంది పేదలు నష్టపోతారు. సంపన్న దేశాలు కూడా ఈ వేడితో బాధపడతాయి.

    వేడి

    పారిస్ ఒప్పందానికి తూట్లు

    ఉష్ణోగ్రతలు పెరగకుండా నిరోధించడానికి, గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను, ముఖ్యంగా శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించాలని పరిశోధకులు తెలిపారు.

    మార్పులు చేయకపోతే మధ్య ఆదాయ, అల్పాదాయ దేశాలు ఎక్కువగా నష్టపోతాయన్నారు.

    ఉద్గారాల వల్ల ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ప్రతికూలంగా ప్రభావితమవుతారని పరిశోధకులు అంచనా వేశారు.

    ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను నివారించడం కోసం 2015లో వాతావరణ మార్పుపై 196 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే.

    ఈ ఒప్పందంలో భాగంగా పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని నిర్ణయించారు.

    కానీ చాలా దేశాలు ఉద్గారాలను అదుపు చేయలేకపోతున్నాయి. ఫలితంగా పారిస్ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాతావరణ మార్పులు
    భారతదేశం
    పాకిస్థాన్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    వాతావరణ మార్పులు

    తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ తెలంగాణ
    దిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం; ట్రాఫిక్‌కు అంతరాయం దిల్లీ
    భారత్‌లో 1,091 పక్షి జాతుల్లో 73% బర్డ్స్‌పై వాతావరణ మార్పుల ప్రభావం భారతదేశం
    మార్చిలో భగభగమన్న భూమి; చరిత్రలో రెండోసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు

    భారతదేశం

    ఖలిస్థానీల కారణంగా భారత్ - కెనడా వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్  కెనడా
    భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు? కెనడా
    దెబ్బకు దెబ్బ.. కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్  కెనడా
    భారత రోడ్లపై ALCAZAR ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ రన్.. 3వరుసల SUVకి కంపెనీ రెడి హ్యుందాయ్

    పాకిస్థాన్

    Asia Cup 2023: నేటి నుంచి ఆసియా కప్ పోరు.. తొలి మ్యాచులో పాకిస్థాన్-నేపాల్ ఢీ ఆసియా కప్
    Asia Cup 2023: వారిద్దరి వల్లే పాక్ పటిష్టంగా తయారైంది: రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్
    విరాట్ కోహ్లీ నన్ను ప్రశంసించడం గర్వంగా ఉంది : పాక్ కెప్టెన్ విరాట్ కోహ్లీ
    పాకిస్థాన్‌: రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025