LOADING...
Hinduja Group Chairman: వ్యాపార రంగంలో విషాదం.. హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ కన్నుమూత
వ్యాపార రంగంలో విషాదం.. హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ కన్నుమూత

Hinduja Group Chairman: వ్యాపార రంగంలో విషాదం.. హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 04, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పారిశ్రామికవేత్త, హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ గోపీచంద్‌ పి. హిందుజా (85) మంగళవారం లండన్‌లో కన్నుమూశారు. ఆయన మృతిచెందిన విషయం కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. వ్యాపార వర్గాల్లో 'జీపీ'గా ప్రసిద్ధి పొందిన గోపీచంద్‌ గత కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లండన్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గోపీచంద్‌ హిందుజా హిందుజా కుటుంబం రెండో తరానికి చెందిన ప్రముఖుడు. 2023లో ఆయన సోదరుడు శ్రీచంద్‌ హిందుజా మరణానంతరం గ్రూప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Details

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న ప్రముఖులు

అనేక రంగాల్లో వ్యాపారాలను విస్తరించిన హిందుజా గ్రూప్‌ను ఆయన సమర్థంగా ముందుకు నడిపారు. ప్రముఖ పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, వాహన తయారీ, శక్తి, ఆరోగ్య రంగాలు వంటి అనేక విభాగాల్లో హిందుజా గ్రూప్‌ అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గోపీచంద్‌ హిందుజా నాయకత్వంలో ఈ సంస్థ మరింత విస్తరించి, గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆయనకు భార్య సునీత హిందుజా, ఇద్దరు కుమారులు — సంజయ్‌, ధీరజ్‌ హిందుజా — అలాగే కుమార్తె రీతా ఉన్నారు. వ్యాపార, ఆర్థిక వర్గాల్లో ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.