తదుపరి వార్తా కథనం

CM Chandrababu: నేడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ!
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 18, 2025
08:22 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం ఈరోజు (జూలై 18) మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశాన్ని ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది లోక్సభ సభ్యులతో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా హాజరుకానున్నారు. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు.