NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Revanth Reddy: పరువు నష్టం కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్‌ పిటిషన్‌
    తదుపరి వార్తా కథనం
    Revanth Reddy: పరువు నష్టం కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్‌ పిటిషన్‌
    పరువు నష్టం కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్‌ పిటిషన్‌

    Revanth Reddy: పరువు నష్టం కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్‌ పిటిషన్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 23, 2025
    04:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న పరువు నష్టం కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు.

    ఈ కేసు గతేడాది భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన కాంగ్రెస్‌ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు చేసిన ఫిర్యాదుతో మొదలైంది.

    రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం బీజేపీకి పరువు నష్టం కలిగించిందని అభిప్రాయపడుతూ కోర్టులో దావా వేశారు.

    దీనిని విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు ఇప్పటికే సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది.

    పిటిషన్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ పేర్కొన్నట్లు ఆరోపించారు.

    Details

    వ్యక్తిగత హాజరకు మినహాయింపు ఇవ్వాలి

    ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లను కోర్టులో సమర్పించిన నేపథ్యంలో కేసు ఇంకా కొనసాగుతోంది.

    కానీ ఈ వ్యవహారాన్ని ముగించాలని సీఎం రేవంత్ హైకోర్టుకు పిటిషన్‌ వేశారు. ఈ కేసును విచారణ చేపట్టవద్దని, తాత్కాలికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

    అలాగే, వ్యక్తిగత హాజరుతో సంబంధించి మినహాయింపు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగనున్నది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    తెలంగాణ

    తాజా

    Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు కన్నప్ప
    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్
    DGCA: విమాన టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విండో షేడ్స్ మూసేయండి.. డీజీసీఏ కీలక ఆదేశాలు భారతదేశం
    Corona Virus: దేశంలో మరోసారి కరోనా కలకలం.. కొత్త వేరియంట్లను గుర్తించిన ఇన్సాకాగ్! కోవిడ్

    రేవంత్ రెడ్డి

    Revanthreddy: తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన తెలంగాణ
    Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ! తెలంగాణ
    Mandha Krishna Madiga: సీఎం రేవంత్‌తో మందకృష్ణ భేటీ.. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికపై ప్రభుత్వానికి సూచనలు భారతదేశం
    LRS: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం తెలంగాణ

    తెలంగాణ

    Telangana: జూన్‌ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం భారతదేశం
    Telangana: బోధనలో నాణ్యత పెంచే లక్ష్యంతో.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులకు ఇంటర్‌ విద్యాశాఖ శ్రీకారం భారతదేశం
    Pre primary: సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ.. ప్రభుత్వ నిర్ణయం భారతదేశం
    Liquor shops closed: రేపు మద్యం దుకాణాలు బంద్.. కారణమిదే? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025