
Revanth Reddy: పరువు నష్టం కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్ పిటిషన్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న పరువు నష్టం కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు గతేడాది భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు చేసిన ఫిర్యాదుతో మొదలైంది.
రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం బీజేపీకి పరువు నష్టం కలిగించిందని అభిప్రాయపడుతూ కోర్టులో దావా వేశారు.
దీనిని విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు ఇప్పటికే సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది.
పిటిషన్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ పేర్కొన్నట్లు ఆరోపించారు.
Details
వ్యక్తిగత హాజరకు మినహాయింపు ఇవ్వాలి
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్లను కోర్టులో సమర్పించిన నేపథ్యంలో కేసు ఇంకా కొనసాగుతోంది.
కానీ ఈ వ్యవహారాన్ని ముగించాలని సీఎం రేవంత్ హైకోర్టుకు పిటిషన్ వేశారు. ఈ కేసును విచారణ చేపట్టవద్దని, తాత్కాలికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
అలాగే, వ్యక్తిగత హాజరుతో సంబంధించి మినహాయింపు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరగనున్నది.