LOADING...
Singareni Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం

Singareni Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన లాభాలను సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థకు సుమారు రూ.3 వేల కోట్లు లాభాలు రావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో సింగరేణి సంస్థ రూ.2,412 కోట్లు లాభం సాధించింది. అందులో సుమారు 33 శాతం, అంటే రూ.796 కోట్లు, కార్మికులకు లాభాల వాటా రూపంలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈసారి లాభాలు మరింత పెరుగనున్న అవకాశంతో, కార్మిక సంఘాలు కూడా లాభాల వాటా శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సింగరేణి యూనియన్ల డిమాండ్ ప్రకారం, 35 శాతం లాభాన్ని కార్మికులకు కేటాయించాలని వారు అభ్యర్థిస్తున్నారు.

వివరాలు 

నేడు సీఎం రేవంత్ రెడ్డితో సింగరేణి కార్మిక సంఘాల నేతలు భేటీ.. 

అయితే, లాభాల వాటా 35 శాతం పెరగడం వలన దాదాపు రూ.900 కోట్ల వరకు కార్మికులకు పంపిణీ అవ్వవచ్చని అంచనాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. సింగరేణి ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఈ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్,ఇతర మంత్రులు సింగరేణి కార్మిక సంఘాల నేతలతో సమావేశం కావడానికి అవకాశం ఉంది.