NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Yogi Adityanath: సంగం నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయి: యోగి ఆదిత్యనాథ్‌
    తదుపరి వార్తా కథనం
    Yogi Adityanath: సంగం నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయి: యోగి ఆదిత్యనాథ్‌
    సంగం నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయి: యోగి ఆదిత్యనాథ్‌

    Yogi Adityanath: సంగం నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయి: యోగి ఆదిత్యనాథ్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2025
    04:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళా జరుగుతున్ననేపథ్యంలో,భక్తులు గత నెల నుంచే పవిత్ర స్నానాలు చేస్తోన్న విషయం విదితమే.

    అయితే,తాజాగా వెలువడిన ఓ నివేదిక పెనుమార్పులకు కారణమైంది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం,నదీ నీటిలో ఫీకల్ బ్యాక్టీరియా అధికంగా ఉండటంతో,స్నానం చేయడానికి నీరు అనుకూలంగా లేదని పేర్కొన్నారు.

    ఈ నివేదికపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు.

    సంగమంలోని నీరు తాగడానికి కూడా అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు.

    పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కూడా ఖండించారు.

    అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ,"గంగామాత,సనాతన ధర్మం,భారత దేశంపై తప్పుడు ప్రచారం చేస్తే, 56 కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని తక్కువ చేసి చూసినట్లే" అని అన్నారు.

    వివరాలు 

    56.25 కోట్ల మంది భక్తులు  పుణ్యస్నానం ఆచరించారు

    పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదిక ఆధారంగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT) కూడా స్పందించింది.

    మహాకుంభ మేళాలో పలు ప్రాంతాల్లో నీటిలో బ్యాక్టీరియా అధికంగా ఉందని పేర్కొంది.

    ప్రయాగ్‌రాజ్‌లో నదిలో స్నానం చేసే భక్తుల సంఖ్య పెరిగిన కారణంగా నీటి నాణ్యత ప్రభావితమై ఉండొచ్చని అంచనా వేసింది.

    అయితే, ఈ ఆరోపణలను కొట్టిపారుస్తూ యోగి ఆదిత్యనాథ్ "సంగమంలోని నీరు తాగేందుకు కూడా అనుకూలంగా ఉంది" అని స్పష్టం చేశారు.

    ఇప్పటి వరకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ గణాంకాల ప్రకారం 56.25 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు.

    వివరాలు 

    మమతా బెనర్జీ విమర్శలు

    కాగా, ఇటీవల మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, దిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే భక్తుల భారీ రద్దీ కారణంగా మరో 18 మంది మరణించిన విషయం తెలిసిందే.

    ఈ ఘటనలపై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.

    దీనిపై స్పందించిన యోగి, "ఆధ్యాత్మిక కార్యక్రమంపై రాజకీయాలు చేయడం ఎంతవరకు సముచితం? మహాకుంభ ప్రారంభమైనప్పటి నుంచి కొంత మంది వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ శతాబ్దంలో జరిగే గొప్ప మేళాలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు" అని వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం

    ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద జనవరి 13న మహాకుంభ మేళా ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

    ఈ నెల 26వ తేదీ వరకు ఈ పవిత్ర ఆధ్యాత్మిక ఉత్సవాన్ని నిర్వహించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.

    ప్రారంభ అంచనాల ప్రకారం 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని భావించినా, ఇప్పటివరకు 56 కోట్ల మంది భక్తులు కుంభస్నానం ఆచరించారు.

    మరో 7 రోజులు మిగిలి ఉండటంతో, భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యోగి ఆదిత్యనాథ్

    తాజా

    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ
    Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు తులం బంగారం బంగారం
    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా

    యోగి ఆదిత్యనాథ్

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఉత్తర్‌ప్రదేశ్
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ అఖిలేష్ యాదవ్
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025