NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andrapradesh: భూ వివాదాలపై సమగ్ర పరిష్కార చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ 
    తదుపరి వార్తా కథనం
    Andrapradesh: భూ వివాదాలపై సమగ్ర పరిష్కార చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ 
    భూ వివాదాలపై సమగ్ర పరిష్కార చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్

    Andrapradesh: భూ వివాదాలపై సమగ్ర పరిష్కార చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 25, 2024
    09:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లో భూ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

    భూ ఆక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, రికార్డు సవరణలు వంటి సమస్యలపై ఫిర్యాదులను జిల్లా స్థాయిలో స్వీకరించి, తక్షణ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.

    జూన్ నుంచి ఇప్పటి వరకు అందిన 71,335 ఫిర్యాదుల్లో 66శాతం వరకు పరిష్కరించనట్లు సమచారం.

    ఫిర్యాదుల పరిష్కారంలో అన్నమయ్య, నంద్యాల, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్‌ జిల్లాలు మెరుగ్గా ఉన్నాయి.

    శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖపట్నం, శ్రీసత్యసాయి, తిరుపతి, బాపట్ల జిల్లాలు వెనుకబడ్డాయి.

    Details

    నెల్లూరు జిల్లాలో అత్యధిక ఫిర్యాదులు

    శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 8,277 ఫిర్యాదులొచ్చాయి.

    కనిష్ఠంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 805 ఫిర్యాదులు మాత్రమే నమోదు కావడం విశేషం.

    ప్రజల ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం డిసెంబరు మొదటి వారంలో ప్రత్యేక రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని యోచిస్తోంది.

    గ్రామ, మండల స్థాయిలో చేపట్టే ఈ సభల ద్వారా వచ్చిన ఫిర్యాదులను 45 రోజుల వ్యవధిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

    ప్రతిభాగితకు స్వీకరణ రసీదులు ఇవ్వడంతోపాటు, పరిష్కారంపై తెలుగులో సమాధానం అందజేస్తారు.

    ఈ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్ అధికారిని నోడల్‌గా నియమించారు.

    Details

    డిసెంబర్ 3, 4 తేదీల్లో సచివాలయంలో ప్రత్యేక సదస్సులు

    రీసర్వే పూర్తయైన 6,860 గ్రామాల్లో 2.76 లక్షల ఫిర్యాదులొచ్చాయి.

    వాటిలో భూముల విస్తీర్ణం తగ్గుదలపై 86 వేలు, సరిహద్దు వివాదాలపై 3 వేల ఫిర్యాదులు నమోదయ్యాయి.

    మరో 47 వేల ఫిర్యాదులు జాయింట్ ఎల్పీఎం కేటాయింపులపై ఉండడం గమనార్హం. వాటిని పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

    డిసెంబరు 3, 4 తేదీల్లో వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు.

    ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని భూ సమస్యల పరిష్కారంపై ముఖ్య చర్చలు చేపట్టనున్నారు.

    ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    నెల్లూరు నగరం

    తాజా

    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్
    OG: పవన్ కళ్యాణ్ 'ఓజీ' రిలీజ్ డేట్ ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం చైన్నై సూపర్ కింగ్స్
    US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి! చైనా

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పామాయిల్‌ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు భారతదేశం
    Chandra Babu: సీ ప్లేన్ ద్వారా విజయవాడ నుంచి శ్రీశైలంకు చంద్రబాబు.. పున్నమి ఘాట్‌లో ట్రయల్ రన్ చంద్రబాబు నాయుడు
    Weather Report : అల్పపీడనం ప్రభావం.. ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు భారత వాతావరణ శాఖ
    AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం.. బడ్జెట్‌పై కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

    నెల్లూరు నగరం

    AP MLC: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి రోడ్డు ప్రమాదం
    Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  జనసేన
    World's Most Expensive Cow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. వేలంలో 40కోట్లకు అమ్ముడుపోయింది  బ్రెజిల్
    Nellore: ఏమి పాపం చేశానమ్మా.. నెల్లూరు జిల్లాలో దారుణం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025