English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్ 
    తదుపరి వార్తా కథనం
    Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్ 
    2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్

    Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్ 

    వ్రాసిన వారు Stalin
    Oct 30, 2023
    03:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 సార్వత్రిక ఎన్నికల ముగింట కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ సవాళ్లలో నగదు కొరత ప్రధాన సమస్యల్లో ఒకటి.

    ఈ క్రమంలో నగదు సంక్షోభాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ త్వరలో దేశవ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

    వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించనుంది.

    నవంబర్‌లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో పోలింగ్ జరగనుంది, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటిస్తారు.

    కాంగ్రెస్

    ఫండ్ ఉంటేనే.. 'ఇండియా' కూటమిపై ఆధిపత్యం

    వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ మరో 25 పార్టీలతో పొత్తు పెట్టుకొని 'ఇండియా' పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది.

    ఈ క్రమంలో కూటమిలోని అన్ని పార్టీలపై ఆధిపత్యం చేలాయించాలంటే.. పార్టీకి వద్ద భారీ స్థాయిలో ఫండ్స్ అవసరం అయితాయి.

    అవసరమైతే.. మిత్రపక్షాలకు కూడా ఫండింగ్ పరంగా కాంగ్రెస్ సాయం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ దగ్గర అవసరమైన నిధులు లేవు.

    ఈ క్రమంలో అవసరమైన నిధుల కోసం పార్టీ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని చేపట్టనుంది.

    అడ్వకేసీ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక ప్రకారం, ప్రస్తుతం కాంగ్రెస్ ఆస్తుల విలువ రూ. 805.68కోట్లు కాగా.. భారతీయ జనతా పార్టీ ఆస్తుల విలువ రూ.6,046.81 కోట్లు.

    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    కాంగ్రెస్

    గత ఏడేళ్లుగా కాంగ్రెస్‌కు భారీగా తగ్గిన కార్పొరేట్ విరాళాలు

    గత 7 సంవత్సరాలుగా కాంగ్రెస్‌కు కార్పొరేట్ సంస్థల విరాళాలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ బీజేపీకి మాత్రం కార్పొరేట్ విరాళాలు భారీగా పెరుగుతున్నాయి.

    గత 7 సంవత్సరాలలో బీజేపీ ప్రకటించిన కార్పొరేట్ విరాళాలు అన్ని ఇతర జాతీయ పార్టీల మొత్తం విరాళాల కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

    2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇతర జాతీయ పార్టీల కంటే బీజేపీ కార్పొరేట్ సంస్థల విరాళాలు 18రెట్లు అధికం కావడం గమనార్హం.

    సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి కార్పొరేట్ సంస్థల విరాళాలు భారీగా వస్తుంటాయి. అందులో భాగంగానే బీజేపీకి వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    కాంగ్రెస్

    ఆప్ బాటలో కాంగ్రెస్

    గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే తరహాలో ఆన్ లైన్ విరాళాలను సేకరించింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వేళ.. కాంగ్రెస్ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది.

    ఆమ్ ఆద్మీ పార్టీ తన కార్యాలయాలను నడపడానికి నిధులు లేకపోవటంతో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది.

    అలాగే 'లంచ్ విత్ సీఎం' కార్యక్రమాన్ని ఆప్ నిర్వహించింది. ఇందులో అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి లంచ్‌, డిన్నర్‌ చేసుకునే అవకాశం సామాన్యులకు లభించింది.

    ప్రతిఫలంగా వారు పార్టీ ఫండ్‌కు డబ్బు చెల్లించేవారు. నిధుల కొరతను తీర్చుకునేందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆప్ బాటలో పయనించేందుకు సిద్ధమైంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Manipur violence: మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ! మణిపూర్
    Vatican City: ప్రపంచంలో విరాళాలతో నిలిచే ప్రపంచపు మినీ దేశం.. అది ఎక్కడుందో తెలుసా? ప్రపంచం
    Rinku Singh: వైభవంగా భారత క్రికెటర్‌ రింకు సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం రింకూ సింగ్
    Singireddy Narayana Reddy: పాటలలో పరవశించిన కవి.. తెలుగు గేయానికి తాళం చెక్కిన తాత్వికుడు 'సినారే'! టాలీవుడ్

    కాంగ్రెస్

    నుహ్ మత ఘర్షణ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్  హర్యానా
    హస్తం గూటికి తుమ్మల నాగేశ్వరరావు.. ఎప్పుడంటే? ఖమ్మం
    Tummala: BRSకు బిగ్‌ షాక్ .. తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా బీఆర్ఎస్
    విభేదాలు పక్కబెట్టాల్సిందే, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి : మల్లిఖార్జున ఖర్గే  హైదరాబాద్

    ఎన్నికలు

    భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే భారతదేశం
    న్యూజిలాండ్‌లో ఆర్థిక మాంద్యం; నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు  న్యూజిలాండ్
    ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పేరిట ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటన ఆంధ్రప్రదేశ్
    10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు రాజ్యసభ

    అసెంబ్లీ ఎన్నికలు

    పని చేయకుంటే ఇప్పుడే తప్పుకోవడం మంచిది.. తెదేపా నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఆంధ్రప్రదేశ్
    నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం  ఖమ్మం
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    BRS MLA List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ  తెలంగాణ

    తాజా వార్తలు

    ఇజ్రాయెల్ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు: గాజాపై దండయాత్రపై బైడెన్ కామెంట్స్  హమాస్
    Cyclone 'Hamoon': బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన 'హమూన్' తుపాను  హమూన్ తుపాను
    Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై 40 రాష్ట్రాల దావా మెటా
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025