NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nitin Gadkari: ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు: నితిన్‌ గడ్కరీ
    తదుపరి వార్తా కథనం
    Nitin Gadkari: ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు: నితిన్‌ గడ్కరీ
    ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు: నితిన్‌ గడ్కరీ

    Nitin Gadkari: ఏపీలో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు: నితిన్‌ గడ్కరీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 06, 2024
    08:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో చేపట్టిన 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

    లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా గడ్కరీ వివరించారు.

    ఎన్‌హెచ్‌-216ఎపై మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్,తేతలి, కైకరం వద్ద నిర్మాణంలో ఉన్న ఐదు వంతెనలను 2025 ఏప్రిల్ 2నాటికి పూర్తవుతాయి.

    అలాగే, ఎన్‌హెచ్‌-16పై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్‌ల వద్ద నిర్మిస్తున్న రెండు వంతెనలను 2025 సెప్టెంబర్ 11కు,విశాఖపట్నం ఎయిర్‌పోర్టు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ను 2025 ఫిబ్రవరి 15లోపు, గుంటూరు మిర్చియార్డు వద్ద నిర్మిస్తున్న వంతెనను 2025 జనవరి 6 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.

    వివరాలు 

    ఫ్లైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు

    ఈ నేపథ్యంలో, ఎన్‌హెచ్‌-16పై నాగులుప్పలపాడు గ్రోత్‌సెంటర్, రాజుపాలెం జంక్షన్ వద్ద వంతెనల నిర్మాణానికి అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు.

    అదే హైవేలో రాజుపాలెం క్రాస్‌రోడ్డు, జొన్నతాళి క్రాస్‌రోడ్డు, చెవ్వూరు క్రాస్‌రోడ్డు, రణస్థలం టౌన్ పోర్షన్‌తో పాటు ఎన్‌హెచ్‌-44పై కియా వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు ఆహ్వానించామని చెప్పారు.

    అలాగే, ఎన్‌హెచ్‌-16లో శ్రీసిటీ జీరో పాయింట్, చిల్లకూరు సెంటర్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణాలకు బిడ్లు ఇంకా పిలవాల్సి ఉందని గడ్కరీ వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ

    తాజా

    SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు   స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    unemployment data: దేశంలో తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలు.. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1శాతం కేంద్ర ప్రభుత్వం
    Anurag Kashyap: లాభాల కోసం కళను తాకట్టు పెట్టిన ఓటీటీ వేదికలు : అనురాగ్ కశ్యప్‌ ఓటిటి
    Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్‌ ను ప్రకటించిన టీమ్‌.. ఎప్పుడంటే?  హరిహర వీరమల్లు

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ బీజేపీ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025