NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
    భారతదేశం

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 22, 2023, 05:56 pm 0 నిమి చదవండి
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
    కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

    దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. గత 24గంటల్లో దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 7,026కి పెరిగింది. కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కేసుల పెరుగుదల, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. దేశంలో కరోనా మరో ఐదుగురు మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 5,30,813కి చేరుకుంది. ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒకరు చొప్పున మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.09 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

    ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ

    క్రమంగా కోవిడ్ కేసుల పెరుగుదలను నమోదు చేస్తున్న ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారం లేఖ రాసింది. వైరస్ వ్యాప్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కరోనాతోపాటు హెచ్3ఎన్2 వైరస్‌ల వ్యాప్తిని నియంత్రించడానికి ఆయా రాష్ట్రాలు క్షేతస్థాయిలో పరిశీలించాలని సూచించారు. కేసులు మరీ ఎక్కువగా పెరిగితే, అవరసమైతే ముందస్తు చర్యలు తీసుకోవాలని భూషణ్ అన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    కోవిడ్
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    కోవిడ్

    చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం చైనా
    దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది, ప్రపంచం సిద్ధమవ్వాలి: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక  ప్రపంచ ఆరోగ్య సంస్థ
    దేశంలో కొత్తగా 552 మందికి కరోనా, 6మరణాలు కరోనా కొత్త కేసులు

    నరేంద్ర మోదీ

    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే దిల్లీ
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ

    ప్రధాన మంత్రి

    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్
    రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు  రిషి సునక్
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు సుప్రీంకోర్టు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023