NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ..
    తదుపరి వార్తా కథనం
    India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ..
    అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా..

    India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    10:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాలను చైనా చేపట్టిన నేపథ్యంలో భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

    ఈ అంశంపై భారత కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ,చైనా వైఖరిని తీవ్రంగా ఖండించింది.

    చైనా చేస్తున్న అప్రజాస్వామిక ప్రయత్నాలను భారత్‌ స్పష్టంగా తిరస్కరించింది.

    ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ వివరిస్తూ, "భారతదేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని కొంత ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టేందుకు చైనా నిరర్థక,ఫలించని ప్రయత్నాలు చేస్తోంది.ఇవి పూర్తిగా మా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి" అని పేర్కొన్నారు.

    అలాంటి చర్యలను భారత్‌ తేటతెల్లంగా తిరస్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

    "అరుణాచల్‌ప్రదేశ్‌ భారతదేశానికి అంతర్భాగం.ఇది విడదీయలేని భాగం.ఏ పేర్లు మార్చినా,ఆ వాస్తవాన్ని మార్చలేరు"అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    2017లో ఆరు ప్రాంతాలకు కొత్త పేర్లు

    చైనా అరుణాచల్‌ప్రదేశంపై వేసే అర్ధరహిత వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు గట్టిగా స్పందిస్తూ వస్తోంది.

    గత ఏడాది కూడా చైనా అరుణాచల్‌లోని 30 ప్రాంతాలకు చైనీస్‌, టిబెటన్‌ పేర్లను పెట్టే ప్రయత్నం చేసింది.

    భారత ప్రభుత్వం ఆ కుట్రను కూడా తక్షణమే వ్యతిరేకించింది. బీజింగ్‌ గతంలో వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే ప్రయత్నంలో నాలుగు విడతల జాబితాలను విడుదల చేసింది.

    మొదటిగా 2017లో ఆరు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది.

    అనంతరం 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చింది. అయితే, ఈ అన్నీ చర్యలను భారత్‌ ప్రతి దఫా ధీటుగా తిరస్కరిస్తూ వస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ.. రణ్‌ధీర్‌ జైస్వాల్‌
    Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె? అనితా ఆనంద్
    Harvard University: మరోసారి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి మరో 450 మిలియన్‌ గ్రాంట్ల కోత అమెరికా
    Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు..  స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025