
Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా జడేజా సతీమణి.. ప్రమాణం చేసిన రివాబా
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్లో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులు రాజీనామాలు చేసిన తరువాత శుక్రవారం నూతన క్యాబినెట్ను ఏర్పాటు చేశారు. గాంధీనగర్లో నేడు 26 మంది సభ్యుల కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం పూర్తి చేసింది. ఇందులో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉన్నారు. గురువారం, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా రాష్ట్ర మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. వ్యవస్థాగత, రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి, రాష్ట్ర క్యాబినెట్ను పునర్రచించాలన్న లక్ష్యంతో ఈ రాజీనామా ప్రక్రియ జరిగింది అని పార్టీ నేతలు మీడియాకు తెలిపారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారం, మంత్రుల సంఖ్య గరిష్టంగా 27 వరకు ఉండవచ్చు.
వివరాలు
రివాబా జడేజా..
1990లో రాజ్కోట్లో జన్మించిన రివాబా జడేజా, ఆత్మియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో మెకానికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యారు. 2016 ఏప్రిల్ 17న భారత క్రికెటర్ రవీంద్ర జడేజాతో వివాహం చేసుకున్నారు. 2019లో భాజపాలో చేరిన రివాబా, 2022లో జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. రాజ్పుత్ వర్గానికి చెందిన ఆమె, కమలదళంలో చేరడానికి ముందు 2018లో కర్ణిసేన మహిళా విభాగంలో చీఫ్గా సేవలందించారు.