Montha Cyclone Effect: ప్రళయవేగంతో దూసుకొస్తున్న 'మొంథా'.. కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన తుపాను
ఈ వార్తాకథనం ఏంటి
గడిచిన ఆరు గంటల్లో మొంథా తుపాను గంటకు సగటున 17 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది. ప్రస్తుతం ఈ తుఫాన్ మచిలీపట్నానికి దక్షిణ-ఆగ్నేయ దిశలో సుమారు 120 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 110 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరానికి మరింత దగ్గరగా చేరుతున్న కొద్దీ, తుపాన్ తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడచిన కొన్ని గంటలుగా సముద్రతీర ప్రాంతాల్లో గాలివానలు మొదలయ్యాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్ర యాత్రలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ముంచుకొస్తున్న తుపాను
మొంథా తీవ్రతుపాన్
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 28, 2025
కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన మొంథా తీవ్రతుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన తుపాన్
ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిమీ, కాకినాడకి 110 కిమీ, విశాఖపట్నంకి 220 కిమీ దూరంలో కేంద్రీకృతం pic.twitter.com/GSKdnpuePw