LOADING...
Cyclone Montha: క్రమంగా బలహీనపడుతున్న 'మొంథా'.. ఏపీలో విస్తారంగా వర్షాలు 
క్రమంగా బలహీనపడుతున్న 'మొంథా'.. ఏపీలో విస్తారంగా వర్షాలు

Cyclone Montha: క్రమంగా బలహీనపడుతున్న 'మొంథా'.. ఏపీలో విస్తారంగా వర్షాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సమాచారం ప్రకారం, 'మొంథా తుపాన్' క్రమంగా బలహీనపడుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం, ''తీవ్ర తుఫాన్ ఇప్పటికే సాధారణ తుఫానుగా మారింది. వచ్చే ఆరు గంటల్లో ఇది తీవ్ర వాయుగుండం స్థాయికి బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది'' అని తెలిపారు.

వివరాలు 

ఈ జిల్లాల్లో  భారీవర్షాలు పడే అవకాశం 

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడవచ్చని హెచ్చరించారు. అలాగే కాకినాడ, డా. బీఆర్‌ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈదురుగాలులు తీవ్రంగా వీస్తాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.