Andhra Pradesh: తీరం దాటిన వాయుగుండం.. ఏపీ తీర ప్రాంతాలకు వర్ష హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ కి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈ సారి వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదు. లేదంటే పంట చేతికి వచ్చే వేళ.. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారి పశ్చిమంగా కదులుతూ దక్షిణ తమిళనాడు వైపు పయనిస్తుంది. ఇది తీవ్ర అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Details
రాయలసీమ ,దక్షిణ కోస్తాకు వర్ష సూచన
దీని ప్రభావం ఏపీపై కూడా లైట్గా ఉండనుంది. ఆంధ్రాలోని రాయలసీమ ,దక్షిణ కోస్తాకు వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో కూడా జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశం మేఘావృతం అయి ఉండటంతో పాటు.. ఉత్తర గాలులతో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ముంచంగిపుట్టులో 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
Details
తెలంగాణలోనూ చలి తీవ్రత
మరోవైపు తెలంగాణలోనూ చలి తీవ్రత కొనసాగుతుంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తూ ఉండటంతో.. మూడు రోజుల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.