NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mock Drills: కేంద్ర హోంశాఖ కీలక సమావేశం.. రేపు 244చోట్ల సెక్యూరిటీ మాక్‌ డ్రిల్స్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Mock Drills: కేంద్ర హోంశాఖ కీలక సమావేశం.. రేపు 244చోట్ల సెక్యూరిటీ మాక్‌ డ్రిల్స్‌
    కేంద్ర హోంశాఖ కీలక సమావేశం.. రేపు 244చోట్ల సెక్యూరిటీ మాక్‌ డ్రిల్స్‌

    Mock Drills: కేంద్ర హోంశాఖ కీలక సమావేశం.. రేపు 244చోట్ల సెక్యూరిటీ మాక్‌ డ్రిల్స్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2025
    01:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్‌,పాకిస్థాన్‌ మధ్య పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి.

    పరిణామాలు ఏ క్షణంలో ఎలా మారతాయో చెప్పలేని అనిశ్చిత పరిస్థితి నెలకొంది.

    ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశాల నుండి దాడులు జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజలు తమను తాము రక్షించుకునే విధానాలపై అవగాహన కల్పించేందుకు మే 7వ తేదీన (బుధవారం) దేశవ్యాప్తంగా సెక్యూరిటీ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

    వివరాలు 

    కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమీక్షా సమావేశం 

    ఈ నేపథ్యంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్‌ నేతృత్వంలో సోమవారం ఒక కీలక సమావేశం జరిగింది.

    ఈ సమావేశంలో దేశంలోని దాడులకు అత్యధిక అవకాశం ఉన్న జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు.

    కేటగిరీ-1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్‌ అణు కేంద్రాన్ని చేర్చారు, ఎందుకంటే ఇక్కడ ప్రధాని నివాసంతో పాటు త్రివిధ దళాల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.

    కేటగిరీ-2లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాలు ఉన్నాయి.

    మొత్తం 244 చోట్ల మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

    వివరాలు 

    ఉగ్రదాడుల దృష్ట్యా ప్రధాన రక్షణ కేంద్రాల్లో డ్రిల్స్ 

    కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాంతాల్లో డ్రిల్స్ జరగనున్నాయి.

    అలాగే మెట్రో స్టేషన్లు, రక్షణ రంగ సంస్థలు, కీలక జాతీయ ప్రాజెక్టుల వద్ద కూడా డ్రిల్స్‌ నిర్వహించనున్నారు.

    పౌరుల భాగస్వామ్యంతో మాక్‌ డ్రిల్స్‌

    ఈ డ్రిల్స్‌లో సర్కారు అధికారులు మాత్రమే కాకుండా, సివిల్‌ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోం గార్డులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ సభ్యులు, నెహ్రూ యువకేంద్ర ప్రతినిధులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను కూడా భాగస్వాములుగా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    ఉగ్రదాడుల సమయంలో యువత, విద్యార్థులు ఎలా స్పందించాలో, తమను తాము ఎలా రక్షించుకోవాలో వారికి సమగ్ర అవగాహన కల్పించాలన్నది హోంశాఖ ఉద్దేశం.

    వివరాలు 

    54 ఏళ్ల తర్వాత మళ్లీ మాక్‌ డ్రిల్స్ 

    దేశంలో సెక్యూరిటీ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు.

    1971లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం జరిగే ముందు, బంగ్లాదేశ్‌ విముక్తి కోసం భారత్‌ చర్యలు చేపట్టిన సమయంలో అప్పటి ప్రభుత్వం కూడా దేశ ప్రజల రక్షణ కోసం ఇలాంటి మాక్‌ డ్రిల్స్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

    ఇప్పుడు 54 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరోసారి దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ చేపడుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాష్ట్రాల పూర్తి జాబితా 

    These are the sites where civil defence drills will happen. Divided in three categories based on threat perception. pic.twitter.com/EEvFv8KQul

    — Kaal Chiron काल्किरण (@Kal_Chiron) May 5, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర హోంశాఖ

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా

    కేంద్ర హోంశాఖ

    పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. తెలుగు రాష్ట్రాలలో ఎంతమందికంటే..? పోలీస్ మెడల్స్
    మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌పీ శ్రీనగర్‌ రాకేష్ బల్వాల్‌ నియామకం మణిపూర్
    French journalist: భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు.. ఫ్రెంచ్ జర్నలిస్టుకు కేంద్రం నోటీసులు ఫ్రాన్స్
    75th Republic Day: 1132 మంది సిబ్బందికి శౌర్య పతకాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025