Delhi assembly elections: దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
మొత్తం 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉత్కంఠభరితమైన పోటీ కొనసాగుతోంది.
ఈ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 13,766 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది.
హోమ్ ఓటింగ్ విధానం ద్వారా అర్హత పొందిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 8న జరగనుంది.
వివరాలు
13,766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ఇటీవల 25 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ, రాజధానిని తిరిగి కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో తీవ్రంగా ప్రచారం చేసింది.
మరోవైపు, గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్, పునరుజ్జీవనాన్ని లక్ష్యంగా పెట్టుకుని పోటీకి దిగింది.
న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), పర్వేశ్ వర్మ (భాజపా), సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్) వంటి ప్రముఖ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని అధికారుల సూచనతో 13,766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.