LOADING...
Delhi Bomb Blast: దిల్లీ పేలుడు కేసు.. బాంబర్‌ ఉమర్‌ నబీ ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు 
దిల్లీ పేలుడు కేసు.. బాంబర్‌ ఉమర్‌ నబీ ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు

Delhi Bomb Blast: దిల్లీ పేలుడు కేసు.. బాంబర్‌ ఉమర్‌ నబీ ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2025
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు (Delhi Bomb Blast) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘోర ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన హ్యుందాయ్‌ ఐ20 కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్‌ ఉమర్‌ నబీ (Dr. Umar Nabi) ఇంటిని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. జమ్ముకశ్మీర్‌ పుల్వామాలోని అతడి నివాసాన్ని గురువారం అర్ధరాత్రి తర్వాత కూల్చివేత ప్రక్రియ ప్రారంభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగానే ఈ చర్య చేపట్టినట్లు తెలిపాయి. గత సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడులో 13 మంది దుర్మరణం పాలయ్యారు.

Details

లోతైన దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీ ఏజెన్సీలు

ఘటనకు కారణమైన హ్యుందాయ్‌ ఐ20 కారును పలు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఉమర్‌ నబీనే నడిపినట్లు విచారణలో తేలింది. కారు లోపల దొరికిన నమూనాలను అతడి కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో పోల్చి పరీక్షించగా... స్టీరింగ్‌ వద్ద ఉన్నది ఉమరేనని నిర్ధారించారు. ఈ పేలుడులో నిందితుడు ఉమర్‌ కూడా మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉగ్ర మాడ్యూల్‌ను వేటాడుతున్న సమయంలోనే ఈ పేలుడు జరిగినట్లు అధికారులు వివరించారు. ఈ మాడ్యూల్‌తో ఉమర్‌కు నేరుగా సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. ఇక ఈ ఉగ్ర నెట్‌వర్క్‌ వెనుక ఉన్న అసలు మాస్టర్మైండ్‌ ఎవరు? దాని విస్తృత వ్యూహం ఏమిటి? అనే అంశాలపై సెక్యూరిటీ ఏజెన్సీలు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.