LOADING...
NIA: దిల్లీ పేలుడు కేసు.. షాహిన్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు
దిల్లీ పేలుడు కేసు.. షాహిన్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు

NIA: దిల్లీ పేలుడు కేసు.. షాహిన్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ బ్లాస్ట్‌ కేసు (Delhi Blast) విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరింత వేగవంతం చేసింది. ఫరీదాబాద్‌ (Faridabad) ఉగ్రకుట్రలో కీలకంగా భావిస్తున్న డాక్టర్‌ షాహిన్‌ (Dr. Shaheen) పాత్రను దృష్టిలో ఉంచుకుని, ఆమెకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. తాజా దాడిలో లఖ్‌నవూలోని షాహిన్‌ నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు పరిశీలనలు జరిపి, కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఇంటి వద్ద లభించిన ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో జమ్మూ-కాశ్మీర్‌లో మరో 8 ప్రదేశాల్లో కూడా ఎన్‌ఐఏ బృండాలు సోదాలు కొనసాగిస్తున్నాయి.

Details

మరికొన్ని నివాసాల్లో దాడులు

ఖాజిగుండ్‌ ప్రాంతంలో డాక్టర్‌ అదీల్‌, పుల్వామాలో డాక్టర్‌ ముజమ్మిల్‌ షకీల్‌, అలాగే రషీద్‌ నివాసాలలో దాడులు జరుగుతున్నట్లు సమాచారం. కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక పోలీసులు, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) సహకారంతో సంయుక్త దళాలు చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Details

జ్యుడీషియల్‌ కస్టడీకి అల్‌-ఫలా వ్యవస్థాపకుడు సిద్ధిఖీ

ఉగ్రవాద సంబంధిత మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన అల్‌-ఫలా యూనివర్శిటీ వ్యవస్థాపకుడు జావేద్‌ అహ్మద్‌ సిద్ధిఖీ (Jawad Ahmed Siddiqui)ను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించాలని దిల్లీ కోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ చేసిన అభ్యర్థనను పరిశీలించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్ర మాడ్యూల్‌లో పాల్గొన్న కొంతమంది వైద్యులకు అల్‌-ఫలా (Al Falah University)తో సంబంధాలు ఉన్నట్లు, తప్పుడు అక్రిడిటేషన్ ఆధారంగా యూనివర్శిటీ విద్యార్థుల నుంచి మొత్తం రూ.415 కోట్లు వసూలు చేసిన విషయాలు బయటపడడంతో ఎన్‌ఐఏ సిద్ధిఖీని ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Advertisement