NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
    Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

    వ్రాసిన వారు Naveen Stalin
    Jun 02, 2023
    11:04 am
    Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
    Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్న పోలీసులు

    సాక్షి హత్య కేసు విచారణలో దిల్లీ పోలీసులు మరో పురోగతిని సాధించారు. వాయువ్య దిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో సాక్షిని హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, సాహిల్ కస్టడీని కోర్టు మరో మూడు రోజులు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే సాహిల్ తరచూ తన స్టేట్‌మెంట్‌లను మారుస్తున్నందున క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. హత్యకు గురైన బాలిక స్నేహితులైన భావన, అజయ్ అలియాస్ జబ్రూ, నీతూలను కూడా పోలీసులు విచారించారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో సాహిల్‌తో ఈ నేరంలో ఎవరికీ సంబంధం లేదని తేలిందని, తాను ఒక్కడినే చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

    2/2

    ఈ హత్య కేసులో మరిన్ని వివరాలు

    ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసులు నిందితుడు సాహిల్‌ మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని కీలక ఆధారాలను సేకరించారు. సీసీటీవీ వీడియోలో కనిపించిన ఎనిమిది మంది వ్యక్తులను కూడా గుర్తించామని, వారి వాంగ్మూలాలను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన ప్రదేశం మాత్రమే కాకుండా రిథాలా నుంచి ఆనంద్ విహార్ మీదుగా బులంద్‌షహర్ వరకు ఉన్న మొత్తం సిసిటివి ఫుటేజీలను స్కాన్ చేసే పనిలో ఉన్నామని దిల్లీ పోలీసులు తెలిపారు. 16ఏళ్ల సాక్షి అనే బాలికను మే 28న సాహిల్ అనే యువకుడు అతికిరాతకంగా కత్తి పొడిచి, సిమెంట్ స్లాబ్‌తో కొట్టి హత్య చేశాడు. మరుసటి రోజు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సాహిల్‌ను అరెస్టు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    హత్య
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దిల్లీ

    ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం  రెజ్లింగ్
    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? నరేంద్ర మోదీ
    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం

    హత్య

     సూరత్‌లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి సూరత్
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక దిల్లీ
    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  దిల్లీ
    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  కేరళ

    తాజా వార్తలు

    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం  టీఎస్ఆర్టీసీ
    జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?  పాలు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం  తెలంగాణ
    ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణా మంత్రి  కర్ణాటక
    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు  అమిత్ షా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023