NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / డిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు: ప్రధాని నరేంద్ర మోదీ 
    తదుపరి వార్తా కథనం
    డిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు: ప్రధాని నరేంద్ర మోదీ 
    డిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు సరికొత్త గుర్తింపు

    డిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు: ప్రధాని నరేంద్ర మోదీ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 01, 2023
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న 17వ భారత సహకార కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసారు.

    డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ స్థాయిలో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. డిజిటల్ లావాదేవీలను సహకార రంగంలోనూ తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తు చేసారు.

    సంక్షేమ ప్రయోజనాలు ప్రత్యక్షంగా ప్రజలకే అందాలని, మధ్యవర్తులు లేకుండా చెల్లింపులు జరగాలన్నారు. నగదుపై ఆధపరపడకుండా లావాదేవీలు జరగాలన్న ఉద్దేశ్యంతో డిజిటల్ ఇండియాను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ప్రధాని తెలియజేసారు.

    గడిచిన నాలుగేళ్లలో 2.5 లక్షల కోట్ల రూపాయలను పీఎమ్ కిసాన్ ద్వారా లబ్దిదారులైన రైతులకు అందజేస్తున్నామని, ఎలాంటి మధ్యవర్తులు లేరని ప్రధాని మోదీ అన్నారు.

    Details

    2014కి ముందు వ్యవసాయానికి కేవలం 90వేల కోట్ల ఖర్చు 

    2014 సంవత్సరానికి ముందు వ్యవసాయ రంగానికి 90వేల కోట్లు ఖర్చు చేసారని, ఆ ఖర్చు కంటే దాదాపు మూడు రెట్ల మొత్తాన్ని పీఎమ్ కిసాన్ ద్వారా రైతులకు అందజేసినట్లు ప్రధాని మోదీ వెల్లడి చేసారు.

    పాలపొడి, వెన్న, నెయ్యి, ఇంకా అనేక రకాల ఉత్పత్తులు దేశంలోనే తయారవుతున్నాయని, చిరుధాన్యాలకు(మిల్లెట్స్) సరికొత్త మార్కెట్ గా ఇండియా ఏర్పడిందని, ఇదంతా భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే జరిగిందని అన్నారు.

    అలాగే ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా మార్చడంలో భారతదేశ కృషి ఉందని మోదీ చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    భారతదేశం
    నరేంద్ర మోదీ

    తాజా

    PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్‌ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్  చాహల్
    Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్  కమల్ హాసన్
    Nagarjuna : చంద్రబాబును కలిసిన నాగార్జున.. అఖిల్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం! చంద్రబాబు నాయుడు
    Ladakh: లద్దాఖ్ ప్రజల స్థానికత, రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం లద్దాఖ్

    దిల్లీ

    మనీష్ సిసోడియాను తలుచుకొని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి  అరవింద్ కేజ్రీవాల్
    హైదరాబాద్ వరల్డ్ ర్యాంక్ 202... అత్యంత ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం హైదరాబాద్
    36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఎయిర్ ఇండియా
    ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీడియో విడుదల.. జాతీయ మహిళా కమిషన్ లో శేజల్ ఫిర్యాదు  తెలంగాణ

    భారతదేశం

    సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా  చైనా
    మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా  చైనా
    భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే ఎన్నికలు
    మరో ఐదు రోజులు నిప్పులు చిమ్మనున్న భానుడు.. జాడలేని వర్షాలు వాతావరణ మార్పులు

    నరేంద్ర మోదీ

    'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం  ప్రధాన మంత్రి
    యూఎన్ హెడ్ ఆఫీస్‌లో మోదీ ఆధ్వర్యంలో యోగా డే: 180 దేశాల ప్రతినిధులు హాజరు  యోగ
    2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ  మన్ కీ బాత్
    ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025