LOADING...
DMK: కాంగ్రెస్‌కు డీఎంకే షాక్‌.. ఇండీ కూటమికి గుడ్‌బై
కాంగ్రెస్‌కు డీఎంకే షాక్‌.. ఇండీ కూటమికి గుడ్‌బై

DMK: కాంగ్రెస్‌కు డీఎంకే షాక్‌.. ఇండీ కూటమికి గుడ్‌బై

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2026
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై కాంగ్రెస్‌తో తమ రాజకీయ పొత్తు కొనసాగదని స్పష్టం చేసింది. లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని కోరుతూ డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్‌కు లేఖ రాశారు. కాంగ్రెస్ సభ్యుల పక్కన కూర్చోవడం తమకు సాధ్యం కాదని అందులో పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంపై డీఎంకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ చర్య కూటమి ధర్మానికి విరుద్ధమని డీఎంకే నేతలు మండిపడ్డారు. కూటమిలో ఉండి వెన్నుపోటు పొడిచిందని, కాంగ్రెస్ తన పాత రాజకీయ వైఖరిని మార్చుకోలేదని విమర్శించారు.

వివరాలు 

కాంగ్రెస్ స్వప్రయోజనాల కోసం కూటమిని బలహీనపరిచే నిర్ణయం

డీఎంకే మద్దతుతోనే కాంగ్రెస్‌కు రాజ్యసభ స్థానాలు, అసెంబ్లీ సీట్లు లభించాయని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ స్వప్రయోజనాల కోసం కూటమిని బలహీనపరిచే నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇకపై కాంగ్రెస్‌కు దూరంగా ఉండి బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నిర్ణయంపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వలాభాల కోసం కూటమి భాగస్వాములను దూరం చేసుకోవడం సరైన రాజకీయ విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement