NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేవి నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..రోజూ 1.70 లక్షల మందికి దుర్గమ్మ దర్శనం
    తదుపరి వార్తా కథనం
    దేవి నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..రోజూ 1.70 లక్షల మందికి దుర్గమ్మ దర్శనం
    రోజూ 1.70 లక్షల మందికి అమ్మవారి దర్శనం

    దేవి నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..రోజూ 1.70 లక్షల మందికి దుర్గమ్మ దర్శనం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 11, 2023
    03:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దసరా నవరాత్రి 2023, ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రఖ్యాత ఇంద్రకీలాద్రి ముస్తాబు అవుతోంది.

    ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు అట్టహాసంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

    శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతీరోజూ లక్షా 70 వేల మంది దుర్గమ్మను దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. సెకనుకు ఇద్దరు లేదా ముగ్గురు భక్తులు దర్శించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

    రోజుకు 4 గంటలు పూజలు, నివేదనలు, 20 గంటలపాటు భక్తుల దర్శనాలు ఉంటాయన్నారు.

    మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రొటోకాల్‌ ఉన్నవారు స్వయంగా వస్తేనే దర్శనానికి అనుమతిస్తామన్నారు.

    details

    అక్టోబర్ 15న తొలి రోజు స్నాపనభిషేకం అనంతరం ప్రత్యేక దర్శనాలు 

    అక్టోబర్ 15న ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. 23న విజయదశమిన 10.30 గంటలకు పూర్ణాహుతితో వేడుకలు ముగియనున్నాయి.

    శరన్నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిది రోజుల్లో అమ్మవారు తొమ్మిది అలంకారాల్లో భక్తులను దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. తొలి రోజు స్నాపనభిషేకం తర్వాత ప్రత్యేక దర్శనాల్లో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు.

    మొదటి రోజు : బాలాత్రిపుర సుందరి దేవి

    రెండో రోజు గాయత్రీ దేవి

    మూడో రోజు అన్నపూర్ణ దేవి

    నాలుగో రోజు మహాలక్ష్మి దేవి

    ఐదో రోజు లలితా త్రిపుర సుందరి దేవి

    ఆరో రోజు సరస్వతి దేవి,

    ఎనిమిదో రోజు కనకదుర్గ దేవి,

    తొమ్మిది రోజు మహిషాశుర మర్దినిగా,

    పదో రోజు రాజరాజేశ్వరి దేవిగా 23న భక్తకోటికి దివ్వదర్శనం ఇవనున్నారు.

    details

    మిగతా రోజుల్లో తెల్లవారుజామునే, 4 గంటల నుంచి దర్శనాలు

    దసరా నాడు బెజవాడ కనకదుర్గమ్మ దేదీప్యమానంగా వెలిగిపోనున్నారు. మొదటి రోజు 15న అమ్మవారి స్నాపనభిషేకం అనంతరం ఉదయం 9 గంటల తర్వాత అమ్మవారి దర్శనాలు మొదలవుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు.

    ఈ క్రమంలోనే రాత్రి 10 గంటల వరకు భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించామని స్పష్టం చేశారు.

    మిగతా రోజుల్లో తెల్లవారుజామునే, 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.

    భక్తుల రద్దీ దృష్ట్యా మూలా నక్షత్రం 20న సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం చేసుకోచ్చని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దసరా నవరాత్రి 2023
    విజయవాడ కనకదుర్గ గుడి

    తాజా

    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార

    దసరా నవరాత్రి 2023

    Dasara Navaratri 2023: భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుకునే విధానాలు  లైఫ్-స్టైల్
    ప్రతిష్టాత్మక కోల్​కతా ట్రామ్​కు 150 ఏళ్లు.. దుర్గా పూజా విశేషాలతో ప్రత్యేక అలంకరణ కోల్‌కతా

    విజయవాడ కనకదుర్గ గుడి

    సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు.. చిత్రీకరించింది ఎవరో తెలుసా? ఎన్‌టీఆర్ జిల్లా
    హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025